బాలీవుడ్‌ ఇండస్ట్రీలో ఎఫైర్‌లు బ్రేకప్‌లు చాలా కామన్‌. ఒకప్పుడు అమర ప్రేమికుల్లా కనిపించిన చాలా మంది ఇప్పుడు బద్ధ శత్రువులుగా మారిపోయారు. మరికొంత మంది తమ గతాన్ని మర్చిపోయి పర్పనల్ లైఫ్‌లో బిజీ అయిపోయారు. అలాంటి అరుదైన జోడి కరీనా, షాహిద్‌. ఈ ఇద్దరు గతంలో ఒకరంటే ఒకరు ప్రాణంగా కలిసి తిరిగారు. కానీ తరువాత విడిపోయి ఒకరి ముఖం ఒకరు చూసుకుండా అయిపోయారు.

 

కరీనా, షాహిద్‌ మధ్య ప్రేమ బంధం బాలీవుడ్‌ సినిమాను ఫాలో అయ్యే ప్రతీ ఒక్కరికి సుపరిచితమే. కొన్నేళ్ల పాటు డేటింగ్ లో ఉన్న వీరిద్దరూ వ్యక్తిగత కారణాల వలన విడిపోయారు. అయితే వీరు విడిపోయిన తరువాత మీడియాతో పాటు బాలీవుడ్‌లో పెద్ద హై డ్రామానే నటించింది. ప్రస్తుతం షాహిద్, కరీనా ఎవరి జీవితాతాల్లో వారు బిజీగా ఉన్నారు.

 

దాదాపు 14 ఏళ్ల తరువాత వారి బ్రేకప్‌కు సంబంధించిన వార్తలపై స్పందించిన కరీనా కపూర్‌. తాజాగా ఓ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో షాహిద్ తో బ్రేకప్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ``జబ్ వి మెట్` సినిమా నా కెరీర్ నే మార్చేసింది.. ఈ సినిమాలో షాహిద్ తో కలిసి నటించాను. ఆ సినిమా కథ ముందుగా షాహిద్ విని నన్ను ఆ సినిమా చేయమని చెప్పాడు. అలా ఆ సినిమాలో భాగమయ్యాను.

 

అయితే 'జబ్ వి మెట్', 'తషాన్' సినిమాలకు మధ్య మా ఇద్దరి జీవితాల్లో చాలా పరిణామాలు జరిగాయి. మేం అనుకున్నదానికి భిన్నంగా విధి మరో ప్లాన్‌ వేసింది. అందుకే మేం విడిపోయాం. అయితే ఇందులో ఎవరి తప్పని చెప్పలేం. ఎవరి దారులు దారులు వారు చూసుకున్నాం` అని చెప్పింది.

 

అదే ఇంటర్వ్యూలో `తషాన్` సినిమా గురించి మాట్లాడుతూ `తషాన్ సినిమా షూటింగ్ లో సైఫ్ ని కలిసాను. ఆ కలయిక తన కెరీర్ తో పాటు జీవితాన్ని కూడా మార్చేసింది` అని తెలిపింది. తన సినిమాతో తన సోల్‌మేట్‌ని కలిశానన్న కరీనా అతడినే ప్రేమించి, పెళ్లి చేసుకున్నానని చెప్పింది. మరి కరీనా వ్యాఖ్యలపై షాహిద్‌ రియాక్ట్ అవుతాడేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: