ప్రస్తుతం సింగర్ మనో, ఆర్.కే రోజా జడ్జీలుగా వ్యవహరిస్తున్న జబర్దస్త్ షోకి టీఆర్పి రేటింగ్ ఎప్పటిలాగానే వస్తుంది. మెగాబ్రదర్ నాగబాబు షో నుండి వెళ్ళిపోనప్పటికీ... మొదటిలో కొంచెం ఇబ్బంది పడినా ఆపై అతను లేని లోటు తెలియకుండా ఈటీవీ వాళ్లు జబర్దస్త్ షోని నిర్విరామంగా సూపర్ గా నడిపిస్తున్నారు. మరోవైపు నాగబాబు జీ తెలుగు ఛానల్ లో ప్రసారం అవుతున్న 'అదిరింది' షోకి జడ్జిగా వ్యవహరిస్తున్నారు. అది కూడా జబర్దస్త్ షో లాగానే ఉంది కానీ అందులోని కమెడియన్లు చేసే స్కిట్లు అంత హాస్యభరితంగా ఉండట్లేదు. ప్రతి స్కిట్టులో కుళ్ళు కామెడీ ఎక్కువై పోవడంతో, వీక్షకులు ఆ షోకి ఆమడ దూరం ఉంటున్నారు.



అలాగే కెమెరా వర్క్ లో, అదిరింది షోని చూపించే విధానంలో అన్ని లోపాలే ఉన్నాయి. దీంతో ఆ షో చూసేందుకు ఎవరూ ఇష్టపడటం లేదు. గతంలో నాగబాబుని నమ్ముకొని ఎన్నో డబ్బులు ఖర్చు చేసి మరీ షో ప్రారంభించిన జీ తెలుగు తర్జన భర్జన పడుతుంది. ఇటువైపు షోని ఎలా హిట్ చేయాలో తెలియక నాగబాబు కూడా తల పట్టుకుంటున్నాడు. మళ్ళీ జబర్దస్త్ షోకి రీఎంట్రీ ఇవ్వాలని కూడా అనుకుంటున్నాడట. కానీ జబర్దస్త్ నుండి వైదొలగిన తర్వాత నాగబాబు ఆ షో పై తీవ్ర విమర్శలు చేశాడు. దీంతో నాగబాబు, ఈటీవీకి మధ్య బాగా చెడింది. నాగబాబు చేసిన వ్యాఖ్యలను మనసులో పెట్టుకున్న జబర్దస్త్ షో నిర్మాత శ్యాం ప్రసాద్ రెడ్డి... నాగబాబు రీఎంట్రీ ఇస్తానన్న... చేర్చుకునేందుకు ఆయన సిద్ధంగా లేరట.



ఒక సంస్థ ఒక వ్యక్తిని నమ్ముకుని నడవదని ఒక వ్యక్తే ఒక సంస్థని నమ్ముకొని బతకాలని జబర్దస్త్ షో యాజమాన్యం నాగబాబుకి చెప్పకనే చెప్పేసింది. మొదటిలో నాగబాబు జబర్దస్త్ లోకి రీఎంట్రీ అని వార్తలు వెల్లువెత్తాయి. కానీ ఎప్పుడైతే శ్యాం ప్రసాద్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశాడో, అప్పటినుండి సన్నిహిత వర్గాలు పెదవి విప్పుతూ నాగబాబు జబర్దస్త్ లోకి రీఎంట్రీ ఇవ్వాలని అనుకోలేదని చెప్పుకొస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: