ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారిన అంశం... యంగ్ హీరో నితిన్ పెళ్లి. అందరు హీరోలు పెళ్లి చేసుకుంటున్నారు... కానీ ఇప్పటి నుండో  ఇండస్ట్రీలో కొనసాగుతున్న నితిన్  మాత్రం ఇప్పటివరకు పెళ్లి ఊసే ఎత్తలేదు. కానీ తాజాగా తాను పెళ్లి చేసుకోబోతున్నాను అని చెప్పి అందరికీ సర్ప్రైజ్ చేసాడు.  అది కూడా ప్రేమ వివాహమే అని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు. దీంతో సింగిల్ ఎవర్  ఎవరినుంచి సింగిల్ నెవెర్  అయిపోతున్నాడు నితిన్. అయితే నితిన్ చేసుకోబోయే అమ్మాయి పేరు షాలిని రెడ్డి . 8 ఏళ్ళ  నుంచి పరిచయం 5 ఏళ్ల నుండి ప్రేమ  ఇప్పుడు ఇలా పెళ్లి అంటూ నితిన్ లవ్ స్టోరీ చెబుతున్నాడు. దీంతో నితిన్ కి కాబోయే భార్య గురించి తెలుసుకోవాలని  గూగుల్లో తెగ  సెర్చ్ చేస్తున్నారు తెలుగు ప్రేక్షకులు. 

 

 

 అయితే ఇక ఇప్పుడు నితిన్ కాబోయే భార్య  షాలిని రెడ్డి కుటుంబానికి సంబంధించిన మరో ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. నితిన్ అత్త వారి కుటుంబానికి మెగాస్టార్ చిరంజీవికి సన్నిహిత సంబంధం ఉన్నట్లు సమాచారం. నితిన్ పెళ్లి చేసుకోబోయే షాలిని రెడ్డి తెలంగాణలోని నాగర్ కర్నూల్ ప్రాంతానికి చెందిన అమ్మాయి. అక్కడ శాలిని రెడ్డి తల్లిదండ్రులు ఇద్దరు వైద్యులు. డాక్టర్ సంపత్ కుమార్.. డాక్టర్ షేక్ నూర్జహాన్ కూతురు శాలిని రెడ్డి. అయితే గత 20 ఏళ్లుగా నాగర్కర్నూల్లో ప్రగతి నర్సింగ్ హోమ్ నడుపుతున్న ఇద్దరికి...  అక్కడ మంచి పేరు ఉంది. వారిది  కూడా ప్రేమ వివాహం కావడంతో ప్రస్తుతం వాళ్ళ కూతురుకు  కూడా అదే చేస్తున్నారు. అయితే వారి కుటుంబానికి  మెగాస్టార్ చిరంజీవి కి సంబంధం ఉంది అంటారా... !

 

 

  మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి అడుగుపెట్టి ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. అయితే 2008లో నూర్జహాన్ ప్రజారాజ్యం పార్టీ తరఫున నాగర్ కర్నూల్ నుంచి ఎమ్మెల్యే టికెట్ అందుకున్నారు. అయితే ప్రజారాజ్యం పార్టీ పెట్టగానే ఆ పార్టీలో చేరింది నూర్జహాన్. ఆ తర్వాత 2009 అసెంబ్లీ ఎన్నికలలో నాగర్కర్నూల్ నియోజకవర్గం నుంచి ప్రజారాజ్యం పార్టీ తరపున పోటీ చేసిన ఓడిపోయారు. ఆ తర్వాత ప్రజారాజ్యం పరిస్థితి ఏంటో అందరికీ తెలిసిందే. నూర్జహాన్ ప్రజారాజ్యం తరఫున ఓడిపోయాక మళ్లీ రాజకీయాలకు దూరంగానే ఉంటున్నారు. ఇక తాజాగా నితిన్ శాలిని రెడ్డి పెళ్లితో  మరోసారి వార్తల్లోకి వచ్చారు. ఈ విధంగా చిరంజీవి నితిన్ అత్తారింటికి మంచి సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: