టాలీవుడ్ లోకి నాని హీరోగా నటించిన కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమాతో హీరోయిన్ గా అడుగు పెట్టింది మెహ్రీన్. మొదటి సినిమాలో కాస్త బొద్దుగా ఉన్నా తర్వాత సినిమాల్లో కాస్త సన్నబడింది. అయితే అందం,అభినయం ఉన్నఈ అమ్మడికి అదృష్టం మాత్రం పెద్దగా వరించడం లేదు. స్టార్ హీరోల సరసన నటించే అవకాశం వస్తున్నా.. అవి మంచి హిట్అవుతున్నా తెలుగు లో పెద్దగా అవకాశాలు రావడం లేదు. తాజాగా ఈ అమ్మడు నటించిన `అశ్వథ్థామ` ఇటీవల రిలీజ్ అయ్యింది. నాగ శౌర్య సొంత బ్యానర్ లో ఈ మూవీ రిలీజ్ అయ్యింది. మొదటి నుంచి ఈ మూవీపై భారీగా అంచనాలు ఉన్నా.. రిలీజ్ అయిన తర్వాత యావరేజ్ టాక్ వచ్చింది. కలెక్షన్లు కూడా అంతంత మాత్రమే అన్న టాక్ వినిపించింది. ఈ సినిమాలో నాగశౌర్య హీరో. ఆయన తండ్రి శంకర్ ప్రసాద్ ఈ చిత్రానికి సమర్పకుడిగా.. తల్లి ఉష నిర్మాతగా వ్యవహరించారు. సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన మేరకు ఫలితాలను రాబట్టుకోలేదు.
అయితే 'అశ్వథ్థామ' సినిమా సమయంలో హీరో నాగశౌర్య తండ్రి మెహ్రీన్ ని ఇబ్బంది పెట్టారట. తాజాగా ఈ విషయం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. 'అశ్వథ్థామ' సినిమాకి సంబంధించిన అన్ని ప్రమోషన్స్ లో మెహ్రీన్ పాల్గొంది. అంతే కాదు ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా చేశారు. ముఖ్య అతిథిగా కె.రాఘవేంద్ర రావు కూడా వచ్చారు. దీంతో ఈవెంట్ కి తప్పకుండా హాజరు కావాలని శౌర్య తండ్రి శంకర్ ప్రసాద్.. మెహ్రీన్ కి చెప్పారట. ఆ సమయంలో మెహ్రీన్ స్కిన్ ఎలర్జీతో బాధపడుతున్నారట. ఈ విషయమే ఆయనకు చెప్పిందట.. అంతే కాదు డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ పంపించిందట. అయినప్పటికీ శంకర్ ప్రసాద్ మాత్రం ఒప్పుకోలేదట.
ఈవెంట్ కి రావాల్సిందేఅని పట్టుబట్టటారట. రాకపోతే హోటల్ బిల్స్ పే చేయనని బెదిరించాడట. ఆయన ప్రవర్తన నచ్చకపోవడంతో చెప్ప పెట్టకుండా హోటల్ ఖాళీ చేసి వెళ్లిపోయిందట. దాంతో హోటల్ యాజమాన్యం శంకర్ ప్రసాద్కు ఫోన్ చేసి అసలు విషయం చెప్పడంతో శంకర్ ప్రసాద్ బిల్లు కట్టక తప్పలేదట. ఇదిలా ఉంటే ఈ మద్య ఫేక్ వార్తలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. ఇది కూడా అలాంటిదే అని కొంతమంది కొట్టిపడేస్తున్నారు.