ఈ మధ్య కాలంలో అభిమానులు సెలబ్రిటీలను ఇబ్బందులు పెట్టిన ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. తాజాగా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లిన సమంతకు చేదు అనుభవం ఎదురైనట్లు తెలుస్తోంది. రెండు వారాల క్రితం సమంత, శర్వానంద్ కాంబినేషన్లో తెరకెక్కిన జాను సినిమా విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదల తరువాత సమంత కాలినడకన కొండ ఎక్కే సమయంలో అభిమానికి వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. 
 
సమంత మెట్లు ఎక్కుతున్న సమయంలో ఒక యువకుడు తన మొబైల్ లో సమంత ఫోటో తీశాడు. మొదట సమంత పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఆ తరువాత కూడా యువకుడు అదే పనిగా ఫోటోలు తీస్తూనే ఉన్నాడు. సమంత కోపంతో నా ఫోటోలు తీయడం ఆపు... మర్యాదగా ప్రవర్తించు అని యువకుడికి అందరిముందే వార్నింగ్ ఇచ్చిందని సమాచారం. సాధారణంగా సమంత అభిమానులపై కోప్పడిన ఘటనలు లేవు. 
 
కానీ యువకుడి ప్రవర్తన హద్దులు దాటటంతో సమంత వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. మెట్లు ఎక్కీఎక్కీ అలసిపోయిన సమంత చిరాకులో ఉండటంతో వార్నింగ్ ఇచ్చి ఉండవచ్చని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు తమిళంలో క్లాసిక్ అనిపించుకున్న 96 సమంత, శర్వానంద్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కి జాను పేరుతో ఫిబ్రవరి 7వ తేదీన విడుదలైన విషయం తెలిసిందే. 
 
తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్టైన ఈ సినిమా తెలుగులో మాత్రం డిజాస్టర్ అనిపించుకుంది. నిర్మాత దిల్ రాజుకు జాను సినిమా భారీ నష్టాలను మిగిల్చినట్లు తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో దిల్ రాజు బ్యానర్లో జాను సినిమా స్థాయిలో నష్టాలు తెచ్చిపెట్టిన సినిమా మరేదీ లేదని సమాచారం. జాను సినిమా ఫ్లాప్ కావడంతో సమంత క్లాసిక్ రీమేక్ లకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.              

మరింత సమాచారం తెలుసుకోండి: