ఈ మద్య కాలంలో బాలీవుడ్ నుంచి వస్తున్న బ్యూటీలు మంచి ఫామ్ లో కొనసాగుతున్నారు. కెరటం సినిమాతో రకూల్ తెలుగు తెరకు పరిచయం అయ్యింది. కెరీర్ పరంగా మంచి విజయాలు అందుకుంటూ నెంబర్ వన్ రేస్ లోకి వెళ్తింది. ఇప్పటికీ బాగానే వెనుకేసుకుంది. హైదరాబాద్ లో సొంత ఇల్లు కొన్నది.. ఫిట్ నెస్ వ్యాపార రంగలో బాగా లాభాలు అర్జిస్తుంది. తాజాగా తెలుగులో భరత్ అనే నేను ఒక హిట్, వినయ విధేయ రామ తో ఫ్లాప్ సొంతం చేసుకున్న కైరా అద్వానీకి హిందీలో కబీర్సింగ్ రూపంలో ఓ బ్లాక్బస్టర్ లభించింది. దాంతో కైరా అద్వానీ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. అప్పుడే ఆమె డేట్స్ కోసం ఎంక్వయిరీస్ మొదలైపోయాయని సమాచారం.
మరోవైపు హీరో షాహిద్ కపూర్ క్రేజ్ కూడా పీక్స్కి చేరింది. హిందీలో ఇప్పటికే "ధోనీ" లాంటి సినిమాల్లో నటించింది కైరా. ఇక తెలుగులో కూడా ఇప్పుడు స్టార్ హీరోయిన్గా మారిపోయింది. అయితే సినిమా ఏదైనా కూడా అందాల ఆరబోతే ధ్యేయంగా ముందుకెళ్తుంది ఈ భామ. ఇప్పటికే "లస్ట్ స్టోరీస్"లో అమ్మడు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ప్రస్తుతం హిందీలో నాలుగు సినిమాలు సహా నెట్ ఫ్లిక్స్ వెబ్ సిరీస్ లోనూ హీరోయిన్ గా నటిస్తోంది. తన బ్రాండ్ ఇమేజ్ ను వాణిజ్య ప్రకటనల వరల్డ్ లో తెలివిగా వినియోగించుకుంటుంది.
దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టాలి అన్న నానుడిని తూచ తప్పకుండా పాటిస్తోంది. ఈ అమ్మడు దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకునే ప్రయత్నం చేస్తుంది. నాలుగు చేతులా ఆర్జిస్తూ.. ఈ అమ్మడు ఈ ఐదారేళ్ల కాలంలోనే దాదాపు రూ.30 కోట్లకు పైగానే వెనకేసిందిట. సినిమాలు..బ్రాండ్ అంబాసిడర్ గా సైన్ చేసిన ప్రాజెక్ట్ ల ద్వారా వచ్చిన మొత్తం లెక్కలు తేల్చగా అంత పెద్ద మొత్తం సేవ్ చేసిందిట. ఈ ఏడాది అమ్మడు డైరీ ఇప్పటికే ఫుల్ అయింది.