తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న హీరోలు మాస్ ఇమేజ్ తో ముందుకు సాగుతున్నారు. పిల్లా నువ్వు లేని జీవితం సినిమాతో మెగాస్టార్ చిరంజీవి మేనళ్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా వెండితెరకు పరిచయం అయ్యాడు. ఈ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత సుబ్రమణ్యం ఫర్ సేల్, సుప్రీమ్ తో మంచి విజయాలు తన ఖాతాలో వేసుకున్నారు. ఆ తర్వాత మెగా బ్రదర్ తనయుడు వరుణ్ తేజ్ ముకుంద, కంచె, ఫిదా తో మంచి విజయాలు అందుకున్నాడు. తాజాగా చిరంజీవి మేనళ్లుడు సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్నాడు. మైత్రీమూవీమేకర్స్ బ్యానర్పై సుకుమార్ సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రం ద్వారా సుక్కు శిష్యుడు చిట్టిబాబు దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. కృతి శెట్టి హీరోయిన్గా తెలుగులో ఎంట్రీ ఇస్తోంది.
సంబంధించిన ఫస్ట్లుక్ని రిలీజ్ చేసి వైష్టవ్ తేజ్కి ఇండస్ట్రీలోకి వెల్కమ్ చెప్పిన రామ్చరణ్ తాజాగా ఈ చిత్ర పోస్టర్ని రిలీజ్ చేసి ఆల్ ది బెస్ట్ చెప్పాడు. ఫషేస్బుక్లో రామ్చరణ్ ఆసక్తికరమైన పోస్ట్ ని షేర్ చేయడం ఆకట్టుకుంటోంది. `బిగ్ వెల్కమ్ వైష్టవ్ తేజ్!. ఈ ప్రయాణాన్ని నువ్వు ప్రేమిస్తావు, పూర్తిస్థాయిలో దీన్ని ఆస్వాదిస్తావు ... బుచ్చిబాబు సానా, కృతిశెట్టి, మైత్రీ మూవీమేకర్స్ టీమ్ అందరికి ఆల్ ది బెస్ట్` అని పోస్ట్ పెట్టాడు.
సముద్ర తీర ప్రాంతంలో జాలరుల జీవిత విధానాన్ని ప్రతిబింబిస్తూ సాగే ప్రేమకథగా ఈ సినిమా సాగనుంది. ఈ మూవీ ప్రేమికులు, కుటుంబాల మద్య జరిగే పోరాటం అని తెలుస్తుంది. హీరోయిన్ తండ్రిగా విజయ్ సేతుపతి ఎంట్రీ ఇచ్చిన తరువాత ఒక రేంజ్ కి వెళుతుందని అంటున్నారు. విలన్ గా 'రాయనం' పాత్రలో విజయ్ సేతుపతి నటన ఈ చిత్రానికి హైలైట్ గా నిలుస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏప్రిల్ 2వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది.