టాలీవుడ్ సినిమా పరిశ్రమకు శర్వానంద్ హీరోగా యువి క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కిన రన్ రాజా రన్ అనే సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమైన సుజిత్, తొలి సినిమాతోనే మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఆ తర్వాత అతనికి ఏకంగా రెబల్ స్టార్ ప్రభాస్ ని దర్శకత్వం వహించే అవకాశం అదృష్టంలా వరించింది. అంతకుముందు బాహుబలి రెండు భాగాలతో అత్యద్భుత విజయాలు విజయాలు అందుకుని, మార్కెట్ పరంగా, క్రేజ్ పరంగా విపరీతమైన కీర్తిని ఆర్జించిన ప్రభాస్, సుజిత్ దర్శకత్వంలో నటించిన సినిమా సాహో దాదాపుగా మూడు వందల కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో, అత్యున్నత సాంకేతిక విలువలతో, ఎంతో భారీగా తెరకెక్కడం జరిగింది. 

 

సినిమా గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చి ఏ మాత్రం అంచనాలు అందుకోలేకపోయింది. ఇక సినిమా పై ఆకాశమే హద్దుగా అంచనాలు పెట్టుకున్న ప్రభాస్ ఫ్యాన్స్ ఆశలన్నీ నిరాశలు అయ్యాయి. ఇక సాహో పరాజయం తర్వాత సుజిత్ దాదాపుగా ఎక్కడా కనపడలేదు, అయితే కొద్ది రోజుల నుండి పలు టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తన తదుపరి సినిమాని రూపొందించాలని భావించి, ఆయన కోసం ఒక మంచి కథని సుజిత్ రెడీ చేసుకుంటున్నట్లు సమాచారం. 

 

ఇక రెండు రోజులుగా ఈ వార్త పలు మీడియా మాధ్యమాల్లో విపరీతంగా విడుదల అవుతుండటంతో, పలువురు నెటిజన్లు సుజిత్ పై మండిపడుతూ ఈ విధంగా కామెంట్స్ చేస్తున్నారు. ఏం పిచ్చి పిచ్చిగా ఉందా, నీ మీద ఎన్నో నమ్మకాలు పెట్టుకున్న రెబల్ స్టార్ ప్రభాస్ ని నాకించేశావు సరిపోలేదా, మళ్లీ ఇప్పుడు రామ్ చరణ్ తో సినిమా తీసి ఆయన ఇమేజ్ ను డ్యామేజ్ చేయాలని చూస్తున్నావా అంటూ కొందరు ఫ్యాన్స్ సుజిత్ పై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. అయితే ప్రస్తుతం ప్రచారం అవుతున్న దానిని బట్టి సుజిత్ తన తదుపరి సినిమాని నిజంగానే చరణ్ తో చేస్తాడా, లేక వేరొక హీరోతో చేస్తాడా అనేది మాత్రం తెలియాల్సి ఉంది.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: