ఛలో ఫేం వెంకీ కుడుముల నాగశౌర్య కి మంచి సక్సస్ ఇచ్చాడు. మొదటి సినిమా అయినా చాలా అద్భుతంగా తీసి ఇప్పటి వరకు నాగశౌర్య కి తగలని హిట్ ని ఇచ్చాడు. అంతేకాదు ఛలో సినిమా శౌర్య సొంత నిర్మాణ సంస్థలో రూపొందించారు. మొదటిసారి నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన శౌర్య ఈ సినిమాని తన తల్లి గారు ఉషా ముల్పూరి ఐరా క్రియోషన్స్ బ్యానర్ మీద తెరకెక్కించారు. ఈ సినిమాతోనే వెంకీ కుడుముల ఇండస్ట్రీకి పరిచయం అవడం ఇక్కడ ఆసక్తికరమైన విషయం. అంతేకాదు ఈ సినిమా ప్రారంభమైనప్పుడు వెంకీ శౌర్య జర్నీ సాఫీగా సాగింది. ఇద్దరు మంచి అండర్ స్టాండింగ్ తో ప్రాజెక్ట్ ని సక్సస్ చేశారు. మొదటి సినిమాతో మంచి వసూళ్ళు కూడా సాధించింది ఛలో సినిమా.

 

అదే ఉత్సాహంతో నర్తనశాల, అశ్వద్దామ సినిమాలను నటిస్తూ నిర్మించారు. ఈ రెండు సినిమాలు దారుణంగా పరాజయాన్ని మూట గట్టుకున్నాయి. ఈ సంగతి అందరికీ తెలిసిందే. అయితే అశ్వద్దామ సినిమా రిలీజ్ టైం లో నాగశౌర్య దర్శకుడు వెంకీ కుడుముల మీద సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ విషయం కూడా అందరికీ తెలిసిందే. ఇద్దరికీ వచ్చిన క్రియోటివ్ డిఫ్రెన్స్ స్క్రిప్ట్ విషయం లో. నాగశౌర్య కథ తనదేనని వెంకీ క్రెడిట్ మొత్తం తనే తీసుకున్నాడని వ్యాఖ్యలు చేశాడు. అంతేకాదు ఛలో సినిమా సమయంలోను వెంకీ కొన్ని ఇబ్బందులు పెట్టాడని అన్నాడు. 

 

కానీ ఈ వ్యాఖ్యలను అసలు పట్టించుకోకుండా నితిన్ తో తెరకెక్కించిన భీష్మ సినిమా మీదే దృష్టి సారించాడు. ఆ సినిమా మీదే మొత్తం ఫోకస్ పెట్టి ద్వితీయ విఘ్నం కూడా విజయవంతం చేశాడు. తాజాగా రిలీజైన భీష్మ హిట్ టాక్ తెచ్చుకుంది. మార్నింగ్ షో నుండి సినిమా మీద పాజిటివ్ క్రియోట్ అయి ఈవినింగ్ కల్లా హిట్ అని ప్రేక్షకులు హిట్ అంటూ చెబుతున్నారు. దీంతో నితిన్ ఫుల్ ఖుషీ అయిపోయాడు. ఇక డైరెక్టర్ వెంకీ కుడుముల అకౌంట్ లో రెండవ హిట్ పడింది. రిలాక్సయిన వెంకీ నాగ శౌర్య ని ఉద్దేశించి చూశావా .. సినిమా హిట్ నువ్వు నన్ను నీ కథ కి క్రెడిట్ మొత్తం కొట్టేశానని అన్నావ్ ..నన్ను అందరిలో కాపీ కథకుడిగా ముద్ర వేశావ్ ..వాటన్నిటికి సమాధానం ఒక్క మాట మాట్లాడకుండా ఇచ్చాను. ఇప్పటికైనా తెలుసుకో అంటూ రివర్స్ కౌంటర్ ఇచ్చాడట. ఏదేమైనా నాగశౌర్య కి వెంకీ కుడుముల మాటలతో బాగా తీరిపోయింది ..అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: