సౌత్ లో గాని నార్త్ లో గాని ప్రేమలు.. బ్రేకప్ లు చాలా కామన్. నచ్చినన్ని రోజులు కలిసి తిరుగారు డేటింగ్ ప్రేరుతో అన్నీ కార్యక్రమాలు కానిచ్చేస్తారు. ఆ తర్వాత మాకు సెట్ అవలేదు అందుకే విడిపోతున్నాము అంటారు. సరదాలు తీరాక మాట్లాడేది ఇదే. ఇలాగే అప్పట్లో షాహిద్ కపూర్.. కరీనా కపూర్ ల మద్య వ్యవహారం గురించి చాలా వార్తలు వచ్చాయి. ఇద్దరు చాలా క్లోజ్ అయ్యారు. చాలా చోట్ల కలిసి కనిపించారు. పెళ్ళి కూడా చేసుకుంటున్నారని చెప్పుకుంటున్నారు. అందరు వీళ్ళని చూసి నిజంగా భార్యా భరలు అయితే బావుంటుందని అనుకున్నారు. కాని ఏదో కారణం వల్ల విడిపోయారు. బ్రేక్ అయిన వీరిద్దరు కూడా కొత్త పార్ట్నర్స్ ని సెలెక్ట్ చేసుకున్నారు. ప్రస్తుతం వారితో హ్యాపీగా లైఫ్ ను లీడ్ చేస్తున్నారు.

 

అయితే వీళ్ళ లవ్ బ్రేకప్ విషయంలో కొన్ని సార్లు షాహిద్ కపూర్ స్పందించాడు. కాని కరీనా మాత్రం ఎక్కడ మాట్లాడలేదు. ఇన్ని సంవత్సరాల తర్వాత కరీనా కపూర్ ఆ విషయమై స్పందించింది. జబ్ వి మెట్ సినిమా సమయంలో షాహిద్ తో పరిచయం అయ్యింది. ఆ సినిమా కథ విని నాకు పంపించాడు. తప్పకుండా బాగుంటుందని సలహా ఇచ్చాడు. ఆ సినిమా నా కెరీర్ ను మార్చేసింది. మా ఇద్దరికి బ్లాక్ బస్టర్ అవడమే కాదు మా టాప్ టెన్ సినిమాలలో ఖచ్చితంగా ఉన్న సినిమా. మా కెరీర్ కి ఆలా సినిమా చాలా కీలకం.

 

సినిమా సమయంలో చాలా జరిగాయి అంటూ కరీనా చెప్పుకొచ్చింది. ఆ చాలా ఏంటీ అనే విషయంపై మాత్రం కరీనా మాట్లాడలేదు. ఇక జబ్ వి మెట్ సినిమా తన కెరీర్ ను ముపు తిప్పితే తషాన్ తన జీవితాన్ని మలుపు తిప్పింది. ఆ సమయంలోనే సైఫ్ ను కలిశాను. నా జీవితంలో కొత్త పరిణామాలు చోటు చేసుకున్నాయి. నేను కోరుకున్న వ్యక్తి దొరికాడని ఆ సమయంలోనే అనుకున్నాను అంటూ వెల్లడించింది. సైఫ్ కు అంతకు ముందే పెళ్లి అయినా కూడా కరీనా ప్రేమించి అతడిని పెళ్లి చేసుకున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం కరీనాకు ఒక బాబు కూడా ఉన్నాడు. అయితే ఇప్పటికి కరీనా ఫస్ట్ లవ్ షాహిద్ కపూర్ ని తలుచుకొని బాధ పడుతుంటుందట. అయితే ఈ విషయంలో కరీనా సన్నిహితులు షాహిద్ కరీనాను చాలా వాడుకున్నాడని ఈ విషయం సైఫ్ కి తెలిస్తే ఇక అంతే అంటూ కామెంట్స్ చేశారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: