యువ హీరో నితిన్ లేటెస్ట్ మూవీ భీష్మ ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. వెంకీ కుడుముల డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా నితిన్ కెరియర్ లో మంచి హిట్ గా నిలుస్తుందని చెప్పొచ్చు. నితిన్ కు జోడీగా రష్మిక నటించిన ఈ సినిమాకు మహతి స్వర సాగర్ మ్యూజిక్ అందించారు. శుక్రవారం రిలీజైన ఈ సినిమా రొమాంటిక్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకులను అలరిస్తుంది. 

 

ఇక ఈ సినిమాతో కొన్నాళ్లుగా సరైన హిట్ లేక సతమతమవుతున్న నితిన్ హిట్ ట్రాక్ ఎక్కేశాడు. తన మార్క్ కామెడీ టైమింగ్ తో ఈ సినిమాలో నితిన్ చాలా కొత్తగా కనిపించాడు. ఇదిలాఉంటే భీష్మ రిజల్ట్ తో నితిన్ బాలీవుడ్ రీమేక్ పై ఓ ఫైనల్ డెశిషన్ తీసుకోనున్నాడట. ఆయుష్మాన్ ఖురానా లీడ్ రోల్ లో బాలీవుడ్ లో వచ్చిన అంధాధున్ మూవీ సూపర్ హిట్ అయ్యింది. ఆ సినిమాతో నేషనల్ అవార్డ్ కూడా అందుకున్నాడు ఆయుష్మాన్ ఖురానా.

 

ఆ మూవీని నితిన్ ఫాదర్ సుధాకర్ రెడ్డి తెలుగు రీమేక్ రైట్స్ కొనేశారు. నితిన్ హీరోగా అంధాధున్ తెలుగు రీమేక్ వస్తుందని అంటున్నారు. అయితే భీష్మ చూసిన తర్వాత నితిన్ భేషుగ్గా ఆ రీమేక్ చేసేయొచ్చని అంటున్నారు. సరైన డైరెక్టర్ చేతిలో పెడితే కచ్చితంగా ఆ రీమేక్ తో కూడా నితిన్ హిట్ కొట్టే అవకాశం ఉందని చెప్పొచ్చు. అంధాధున్ రీమేక్ బాధ్యతలను సుధీర్ వర్మ చేతుల్లో పెట్టారని తెలుస్తుంది. అఫిషియల్ గా ఎనౌన్స్ చేసే వరకు వెయిట్ చేయాల్సిందే.  వెంకీ అట్లూరి డైరక్షన్ లో రంగ్ దే సినిమా చేస్తున్నాడు నితిన్. ఆ సినిమాతో పాటుగా చంద్రశేఖర్ ఏలేటి డైరక్షన్ లో కూడా ఒక సినిమా లైన్ లో పెట్టాడు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: