అరవింద సమేత తర్వాత జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా అనగానే అభిమానుల్లో ఒక రేంజ్ ఆసక్తి నెలకొంది. అరవింద సమేత తర్వాత ఆర్ఆర్ఆర్ సినిమాను చేస్తున్నాడు తారక్. ఈ సినిమా లో రామ్ చరణ్ తో కలిసి నటిస్తున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకి రానుంది. ప్రస్తుతం శరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. వికారాబాద్ అడవుల్లో గత పది రోజుల నుంచి కీలక సన్నివేశాలను దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్నారు. 

 

ఇక ఈ సినిమా చేస్తూనే జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ కి ఒకే చెప్పేసాడు. ఎన్టీఆర్  తన 30 వ సినిమాను త్రివిక్రమ్ తో చేస్తున్నాడు. ఈ సినిమా టైటిల్ ని చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. “అయిననూ పోయి రావలె హస్తినకు” అనే టైటిల్ ని ఖరారు చేసారు. ముందు నుంచి ఈ సినిమా రాజకీయ నేపధ్యంలో ఉంటుంది అని భావించారు. ఆ విధంగానే ప్రస్తుతం విడుదల చేసిన టైటిల్ పోస్టర్ ఉన్నాయి. ప్రస్తుతం అధికారికంగా విడుదల చేసిన పోస్టర్ లో జూనియర్ ఎన్టీఆర్ ప్రజలను చూస్తూ నిలబడ్డాడు. 

 

రిలీజ్ చేసిన కాసేపటికే సోషల్ మీడియా లో ఈ టైటిల్ వైరల్ గా మారింది. ఇక ఈ సినిమా ను హారిక అండ్ హాసిని బ్యానర్ పై ఎస్.రాధాకృష్ణ, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు. ముందు రాధాకృష్ణ ఒక్కరే అనుకున్నా, ఎన్టీఆర్ ఇచ్చిన మాట ప్రకారం కళ్యాణ్ రామ్ కూడా నిర్మాణంలో భాగస్వామి అయ్యారు. ఈ సినిమాను వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయనున్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ ని రెడీ చేస్తున్నారు త్రివిక్రమ్. కాగా ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ పూర్తి కాగానే ఈ సినిమా షూటింగ్ లో జూనియర్ ఎన్టీఆర్ పాల్గొంటాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: