సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రం జనవరి 11వ తారీఖున విడుదలై ఓ మాదిరి విజయం సాధించిన సంగతి తెలిసిందే. మీకు అర్థమవుతుందా అని రష్మిక మందాన, నెవ్వర్ బిఫోరూ ఎవ్వర్ ఆఫ్టరూ అంటూ మహేష్ బాబు చెప్పిన డైలాగులు ప్రతి ప్రేక్షకుడిని బాగా కట్టిపడేశాయి. వయసు పైబడిన నటి విజయశాంతి కూడా ఈ సినిమాలో నటించారు కానీ ఆమె నటన ప్రేక్షకులను అంతగా అలరించేలేదని చెప్పుకోవచ్చు.

 

 

మరోవైపు సంక్రాంతి బరిలోకి దిగిన అల వైకుంఠపురములో చిత్రం సరిలేరు నీకెవ్వరుపై బాగా ప్రభావం చూపింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కి ప్రజల్లో మంచి టాక్ వినిపించింది. దీంతో ఈ 2 సినిమాలను పోల్చడం, సరిలేరు నీకెవ్వరు చిత్రం గురించి కాస్త నెగిటివ్ టాక్ వినిపించడం ఆరంభమైంది. ఏదేమైనా రెండు సినిమాలు ఒకేలా ఎంటర్ టైన్ చేసే విధంగా ఉన్నాయంటూ చాలా మంది అభిప్రాయపడ్డారు. అదేవిధంగా బాక్సాఫీస్ కలెక్షన్లు చూసుకుంటే రెండు చిత్రాలు అటు ఇటు గా డబ్బులను వసూలు చేశాయని నివేదికలు తెలిపాయి.




ఇకపోతే, వెండితెరపై ప్రేక్షకుల్ని అలరించిన ఈ రెండు సినిమాలు బుల్లితెరపై ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్న వారు కోకొల్లలుగా ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే అల్లు అర్జున్ తమ అభిమానులను ఆనందపరిచే లాగా బుల్లితెర ప్రేక్షకుల ముందుకు ఈనెల 26వ తేదీన సన్ నెక్స్ట్ ఛానల్ ద్వారా రాబోతున్నారు. కానీ మహేష్ బాబు మాత్రం తన అభిమానులను నిరాశపరుస్తున్నాడు. ఎందుకంటే అతని సినిమా ఇంకా బుల్లితెరపై ప్రసారం అయ్యేందుకు సిద్ధం కాలేదు. మార్చి నెలలో సరిలేరు నీకెవ్వరు సినిమా విడుదల అయ్యేందుకు అవకాశం ఉంది కానీ ఆఫీసియల్ గా ఏ కన్ఫర్మేషన్ రాలేదు. డిజిటల్ ఫ్లాట్ఫామ్ వెబ్సైటులలో కూడా అల వైకుంఠపురములో సినిమా సరిలేరు నీకెవ్వరు చిత్రం కంటే ముందస్తుగానే విడుదల కాబోతోంది. అసలే సరిలేరు నీకెవ్వరు చిత్రం అంతగా అలరించలేదని ఓ పక్క అభిమానులు నిరాశ లో ఉండగా మళ్ళీ ఆ సినిమా కూడా బుల్లితెరపై ప్రసారమయ్యేందుకు ఆలస్యం అవుతుండడంతో వారి నిరాశ తీవ్రమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: