శంకర్ తెరకెక్కిస్తున్న తాజా వండర్ `ఇండియన్ 2`. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై అల్లిరాజా సుభాస్కరన్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. కమల్హాసన్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్గా కాజల్అగర్వాల్ నటిస్తోంది. 1996లొ వచ్చిన `భారతీయుడు` చిత్రానికి సీక్వెల్గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రస్తుత సమకాలీన అంశాల నేపథ్యంలో అత్యంత శక్తివంతమైన సందేశంతో శంకర్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
చెన్నైలో షూటింగ్ జరుగుతుండగా లైటింగ్ కోసం ఏర్పాటు చేసిన క్రేన్ ఒక్కసారిగా విరిగిపడటంతో సెట్లో వున్న అసిస్టెంట్ డైరెక్టర్ కృష్ణ, ప్రొడక్షన్ అసిస్టెంట్ మధు, ఆర్ట్ డిపార్ట్మెంట్కు చెందిన చంద్రన్ అక్కడికక్కడే మృతి చెందడం తీవ్ర కలకలాన్ని రేపుతోంది. ఈ దుర్ఘటనపై పలువురు సెలడ్రిటీలు విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సీరియస్ యాక్షన్ తీసుకున్నచెన్నై పోలీసులు ఇప్పటికే చిత్ర బృందానికి సమన్లు పంపించారు. శుక్రవారం క్రేన్ ఆపరేటర్ని అరెస్ట్ చేశారు.
తాజాగా ఈ ఘటనలో చనిపోయిన నటులకు సంతాప సభని ఏర్పాటు చేశారు. ఇందులో పాల్గొన్న నటుడు రాధారవి దర్శకుడు శంకర్పై పరోక్షంగా విమర్శలు చేయడం తమిళ ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. కొంత మంది దర్శకులు హాలీవుడ్ స్థాయి చిత్రాల్ని నిర్మించాలనుకుంటారు కానీ నటీనటులు, సాంకేతిక నిపుణుల భద్రత గురించి మాత్రం పట్టించుకోరని విమర్శలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఇక ఇదిలా ఉంటే ఇంతకన్నా భారీ చిత్రాలు తెరకెక్కిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఒక్కోసారి మనం చెప్పలేనంతగా కొన్ని జరుగుతుంటాయి. దానికి ఎవ్వరూ కావాలని అయితే చెయ్యరు. అందుకు ఏదో జరిగిందని సడెన్గా విమర్శించడం కూడా సరికాదని చాలా మంది సోషల్ మీడియా ద్వారా కామెంట్లు పెడుతున్నారు. ఇప్పటివరకు శంకర్ నిర్మించిన చిత్రాలన్నీ దాదాపుగా హైబడ్జెట్ టెక్నికల్ వాల్యూస్ ఉన్న చిత్రాలే ఎక్కువగా ఉంటాయి. మరి ఎప్పుడూ జరగనిది ఈ సారి జరగడం అనేది బాధాకరమైన విషయమే.