గ‌త ఏడాది ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాల‌తో ఆకట్టుకోలేకపోయిన బాలయ్య.. ఆ త‌ర్వాత రూలర్ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. అయితే ఈ సినిమా కూడా ఏమాత్రం ప్రభావం చూప‌లేక‌పోయింది. ఇక ప్ర‌స్తుతం సూపర్ హిట్ కాంబినేషన్‌గా పేరొందిన నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను ముచ్చటగా మూడోసారి కలిసి పనిచేస్తున్న సంగతి తెలిసిందే. బాలయ్యా.. బోయపాటి సినిమా కోసం అప్పుడే కసరత్తులు కూడా ప్రారంభించారు. సినిమా కోసం పూర్తిగా కొత్త లుక్‌లో వచ్చారు. ఈ సినిమా బరువు కూడా భారీగానే తగ్గిపోయారు. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన సింహా, లెజెండ్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు స్థాయిలో కలెక్షన్స్ అందుకున్న విషయం తెలిసిందే.  

 

ఇక ముడవసారి కూడా వీరి కాంబినేషన్స్ తెరపైకి వస్తుండడంతో అంచనాలు భారీగా పెరిగాయి. అలాగే ఈ చిత్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా ముగిశాయి. ఈ లోగా పలు అవాంతరాలు ఏర్పడడం వల్ల రెగ్యూలర్ షూటింగ్ మాత్రం స్టార్ట్ కాలేదు. త్వరలోనే ఇది షూరు కానుంది. ఈ నేపథ్యంలో హీరోయిన్‌ విషయమై ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ చిత్రంలో నయనతార అంటూ కొన్ని రోజులు.. కేథరిన్‌ అంటూ మరికొన్ని రోజులు ప్ర‌చారం జ‌రిగింది. అయితే చివరకు ఈ చిత్రానికి శ్రియను ఖరారు చేసినట్లుగా సమాచారం అందుతోంది. 

 

బాలయ్యతో నటించేందుకు స్టార్‌ హీరోయిన్స్‌ ఆసక్తి చూపడం లేదు, చిన్న హీరోయిన్స్‌ వయసు మరీ తక్కువగా అనిపిస్తుంది. ఇలాంటి నేపథ్యంలో బాలయ్యతో గతంలో నటించిన శ్రియను ఫైనల్‌ చేసినట్లుగా సమాచారం అందుతోంది. ఇప్ప‌టికే బాలయ్య, శ్రియ కాంబోలో వ‌చ్చిన‌ పైసా వసూల్ సినిమా నిరాశ పర్చింది. అయిన‌ప్ప‌టికీ  శ్రియకు మంచి క్రేజ్‌ ఉన్న కారణంగా ఆమెతో రొమాన్స్‌ అయితేనే వర్కౌట్ అవుతుంద‌ని బాలయ్య ఫైనల్‌గా ఆమెనే ఫిక్స్‌ చేయమని బోయపాటికి సలహా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఏదేమైనా బాల‌య్య‌ మ‌ళ్లీ పాత హీరోయిన్‌నే ఎంచుకున్నాడు. మ‌రి ఎంత వ‌ర‌కు వ‌ర్కౌట్ అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: