టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో రామ్ చరణ్.. నటించిన సినిమాలు కొన్నే అయినా దాదాపు అన్నీ బ్లక్ బస్టర్స్ కావడం విశేషం.  చిరుత తో తన ప్రస్థానం మొదలు పెట్టిన రామ్ చరణ్ తర్వాత మగధీర లాంటి బిగ్గెస్ట్ హట్ సినిమాతో రికార్డులు క్రియేట్ చేశారు. ఆ మద్య సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘రంగస్థలం ’ సినిమాలో రామ్ చరణ్ నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి.  ఆ తర్వాత బోయపాటి దర్శకత్వంలో వినయ విధేయ రామ సినిమాతో భారీ డిజాస్టర్ పొందారు.  ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ మల్టీస్టారర్ మూవీగా ‘ఆర్ ఆర్ఆర్’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.  ఈ మూవీ తర్వాత రామ్ చరణ్ ఎవరితో రాబోతున్నాడు అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

 

 ఈ నేపథ్యంలో రామ్ చరణ్ ఓ షాకింగ్ నిర్ణయం తీసుకోవడం హాట్ టాపిక్ గా మారింది.  ఇక రాజమౌళి డైరెక్ష‌న్‌లో తెర‌కెక్కుతున్న విజువ‌ల్ వండ‌ర్ `ఆర్ ఆర్ ఆర్‌`. దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టిస్తున్న ఈ మూవీ ప్రీరిలీజ్ బిజినెస్ ప‌రంగా, డిజిట‌ల్ రైట్స్ ప‌రంగా చ‌రిత్ర సృష్టించ‌బోతోంది.   అక్కినేని ఫ్యామిలీకి `మ‌నం` వంటి మ‌ర‌పురాని మూవీ అందించిన ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ కుమార్ గ‌త కొంత కాలంగా వ‌రుస ఫ్లాపుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. `మ‌నం` త‌రువాత ఆయ‌న చేసిన 24, హ‌ల్లో, నాని గ్యాంగ్ లీడ‌ర్ వ‌రుస‌గా బాక్సాఫీస్ వ‌ద్ద ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నాయి.  రామ్‌చ‌ర‌ణ్  `ఆర్ ఆర్ ఆర్‌` త‌రువాత విక్ర‌మ్ కుమార్‌తో సినిమా చేయ‌డానికి గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు తెలిసింది. దాంతో ఫ్యాన్స్ ఇప్పుడు ఆలోచనలో పడ్డట్టు తెలుస్తుంది.. వరుస ఫ్లాపులు ఉన్న ద‌ర్శ‌కుడికి సినిమా ఇవ్వాలంటే ఎవ‌రైనా ఆలోచిస్తారు.. మరి రామ్ చరణ్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారేంటబ్బా అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

 

 ఇటీవ‌ల రామ్‌చ‌ర‌ణ్‌కు  విక్ర‌మ్ కుమార్ ఓ లైన్ వినిపించార‌ట‌. క‌థ, క‌థ‌నం కొత్త‌గా వుండ‌టంతో అత‌నితో సినిమా చేయ‌డానికి రామ్‌చ‌ర‌ణ్ అంగీక‌రించిన‌ట్టు తెలుస్తోంది.  విక్ర‌మ్ కుమార్ మంచి స్క్రీన్‌ప్లే మాస్ట‌ర్‌ అని తెలిసిందే.. బ్యాడ్ లక్ తో సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.. కానీ కలిసొస్తే మనోడు కూడా స్టార్ డైరెక్టర్ అనే చెప్పొచ్చు. ఆ న‌మ్మ‌కంతోనే రామ్‌చ‌ర‌ణ్ తాజా చిత్రాన్ని అంగీక‌రించిన‌ట్టు తెలిసింది. మైత్రీ మూవీమేక‌ర్స్ నిర్మించ‌నున్న ఈ చిత్ర అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ ఏప్రిల్ చివ‌రి వారంలో రానున్న‌ట్టు చిత్ర వ‌ర్గాల స‌మాచారం.


 

మరింత సమాచారం తెలుసుకోండి: