సెలబ్రిటీలు ప్రతీ విషయంలోనూ ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఎంత జాగ్రత్తగా ఉన్న ఒక్కోసారి వాళ్లు చేసే పనులు విమర్శల పాలు అవుతుంటాయి. తమ తప్పు లేకపోయినా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. తాజాగా అలాంటి పరిస్థితిలో ఉన్నాడు సీనియర్‌ నటుడు మాజీ ఎంపీ శత్రుఘ్న సిన్హా. ఇటీవల సిన్హా పాకిస్తాన్‌ లోని లాహోర్‌ లో జరిగిన ఓ వివాహానికి హాజరయ్యాడు. ఆ వేడుకలో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌ గా మారాయి.

 

లాహోర్‌ కు చెందిన ఓ లోకల్‌ ఫోటో గ్రాఫర్‌ సిన్హా అక్కడ వివాహ వేడుకలో పాల్గొన్న సిన్హా ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వివాహానికి సంబంధించిన కవ్వాలి నైట్ కార్యక్రమంలో కూడా సిన్హా పాల్గొన్నట్టుగా జాతీయ మీడియా పేర్కొంది. పాకిస్తానీ నటి రీమా ఖాన్‌ తో సిన్హా కలిసి ఉన్న వీడియో కూడా సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తోంది. ఆ వీడియోలో బ్లాక్‌ సూట్ లో అల్ట్రా స్టైలిష్‌ గా ఉన్నాడు సిన్హా. తన ట్రేడ్‌ మార్క్‌ స్కార్ఫ్‌ ను ధరించి అదరగొట్టాడు.

 

అయితే సిన్హా పాకిస్తాన్‌ లో వివాహ వేడుకలో సందడి చేయటంపై ఓ వర్గం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. `భారతీయ సైనికులు సరిహద్దులో మనల్ని రక్షిస్తూ ప్రాణాలు కోల్పోతుంటే.. మన బాలీవుడ్‌ నటీనటులు మాత్రం పాకిస్తానీ లతో స్నేహ బంధాన్ని కొనసాగిస్తున్నారు` అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు కాస్త హద్దు దాటి తీవ్ర పదజాలంతో విమర్శలకు దిగుతున్నారు. మరో నెటిజెన్ కాస్త వెటకారంగా కామెంట్ చేస్తూ `మేం శత్రుఘ్న సిన్హా లాహోర్‌ ఏం చేస్తున్నాడు? అని ఆయన్న ప్రశ్నిస్తే ఆయన మాత్రం కామోష్‌ అంటూ సమాధానం ఇచ్చాడు` అంటూ కామెంట్ చేశాడు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

Attended wedding in Lahore . . #shatrughansinha #lahore #weddingbells #qawalinight

A post shared by Reema Khan (@iamreemakhan) on

మరింత సమాచారం తెలుసుకోండి: