టాలీవుడ్ లో చాలామంది హీరోల వారసులు దూసుకొస్తున్నా సరే.. స్వశక్తితో ఎదిగే నటీనటులు కూడా ఉన్నారు. అందులో గోపీచంద్ ఒకరు. వందలకోట్ల మార్కెట్ లేకపోయినప్పటికీ గోపీచంద్ గురించి అందరికి తెలుసు. అయన ఫాదర్ టి కృష్ణ ప్రముఖ దర్శకుడుగా ఇండస్ట్రీకి సుపరిచితులు. ఆయన తీసిన సినిమాలన్నీ హిట్ కొట్టాయి. అయితే గోపీచంద్ కి 8ఏళ్ళ వయస్సులో తండ్రి కన్నుమూయడం పెద్ద షాక్. ఇక మొదటి సినిమాతో హీరోగా వచ్చి.. ఆతర్వాత విలన్ గా చేయాల్సి వచ్చినా కూడా ఎక్కడా బాధ పడకుండా, ఆదిశగా అడుగులు వేసాడు గోపీచంద్. ఈ క్రమంలోనే టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పర్చుకున్నాడు.
ఇక గోపీచంద్ శ్రీకాంత్కు బంధువే అవుతాడు. వాస్తవానికి గోపీచంద్ దిల్సుఖ్నగర్కు చెందిన హరితతో నిశ్చయమైంది. కానీ ఏవో కారణాల వల్ల పెళ్లి రద్దు అయింది. ఆ తర్వాత గోపీచంద్ కి రేష్మ తో పెళ్లి జరిగింది. రేష్మ హీరో శ్రీకాంత్ కి మేనకోడలు. ఇద్దరు సినిమాకి చెందినా వారే కావడం అందులోనూ గోపీచంద్ మరియు శ్రీకాంత్ మంచితనంతో చిత్ర పరిశ్రమలో మంచి పేరు సంపాదించుకోవడం వీరి కుటుంబాల మధ్య బంధానికి దారి తీసింది. అంటే శ్రీకాంత్కు గోపీచంద్ కొడుకు వరస అవుతాడన్నమాట. ఇక ప్రస్తుతం గోపీచంద్ కి విరాట్ కృష్ణ అనే కుమారుడున్నాడు. తన తండ్రి పేరుని కొడుక్కి పెట్టుకుని, తండ్రిని అతని కొడుకులో చూసుకుని మురిసిపోతున్నాడు గోపీచంద్.
కాగా, గోపీచంద్ కొంతకాలంగా సక్సెస్ లేక బాగా వెనకబడిపోయారు. ఒకప్పుడు నిర్మాతల హీరోగా ఉన్న గోపీచంద్ పరిస్థితి ప్రస్తుతం మారిపోయింది. ఇటీవల కాలంలో అయితే గోపీచంద్ బ్యాక్ టూ బ్యాక్ డిజాస్టర్స్ తో ఊహించని అపజయాలను ఎదుర్కొన్నాడు. ఎంత కష్టపడినా పెట్టిన బడ్జెట్ కూడా వెనక్కి రావడం లేదు. మొన్న దసరా సమయంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చాణక్య అయితే మరీ దారుణంగా నష్టాలను మిగిల్చింది. ఇక ప్రస్తుతం సంపత్ నంది డైరెక్షన్ లో తెరకెక్కబోయే సినిమా మాత్రం సెట్స్ పైకి వచ్చింది. ఆ సినిమా ఎలాగైనా సక్సెస్ అవ్వాలని గోపీచంద్ చాలా కష్టపడుతున్నాడు.