ఒకప్పటి బాలీవుడ్ క్లాసిక్ మిస్టర్ ఇండియా సినిమాను రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రముఖ బాలీవుడ్ ఫిలిం మేకర్ అలీ అబ్బాస్ జాఫర్ మిస్టర్ ఇండియాను రీమేక్ చేస్తున్నట్టుగా ప్రకటించాడు. అయితే ఈ వార్తలపై బాలీవుడ్ హాట్ బ్యూటీ సోనమ్ కపూర్ ఫైర్ అయ్యింది. మిస్టర్ ఇండియా రీమేక్ వార్తలపై ఆమె అసహనం వ్యక్తం చేసింది. అంతేకాదు రీమేక్ చేస్తున్న చిత్రయూనిట్ తన తండ్రి సీనియర్ నటుడు అనిల్ కపూర్ పట్ల అమర్యాధ పూర్వకంగా ప్రవర్తించినట్టుగా భావిస్తోంది సోనమ్. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.
ఈ సందర్భంగా అభిమానుల కోసం ఓ సందేశాన్ని తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. `చాలా మంది నన్ను మిస్టర్ ఇండియా రీమేక్ గురించి అడుగుతున్నారు. నిజంగా చెపుతున్నా మా నాన్నకు కనీసం ఆ సినిమాను రీమేక్ చేసే ఆలోచన ఉన్న విషయం కూడా తెలియదు. మేము కూడా ఆ వార్తలను అలీ అబ్బాస్ జాఫర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసినప్పుడే చూశాం. ఇది నిజంగా మా నాన్న పట్ల అమర్యాదగా ప్రవర్తించటమే. రీమేక్ ఆలోచనలో ఉన్న ఏ ఒక్కరు కూడా మా నాన్న కానీ, శేఖర్ కపూర్ అంకుల్ను కానీ సంప్రదించే ప్రయత్నం చేయలేదు. వాళ్లిద్దరే మిస్టర్ ఇండియా సినిమాలో కీలక పాత్రల్లో నటించారు` అంటూ భావోద్వేగంగా ట్వీట్ చేసింది.
అంతేకాదు `మా నాన్న తన మనసు, కష్టం పెట్టి ఆ సినిమా కోసం పని చేశారు. ఆ సినిమాతో ఆయనకు ఎంతో అనుబంధం ఉంది. ఆయన్ను కనీసం సంప్రదించకుండానే రీమేక్పై ప్రకటన చేయటం బాధాకరం. ఆ సినిమా అనిల్ కపూర్ లెగసీలో ఓ భాగం. అయితే ఇప్పుడు రీమేక్ విషయంలోనూ సినిమా సక్సెస్ కావాలనే నేను ఆశిస్తున్నా` అంటూ రీమేక్పై తనదైన స్టైల్లో సెటైర్ వేసింది.
FYI pic.twitter.com/YRmrny8VeW
— Sonam K Ahuja (@sonamakapoor) February 22, 2020