వరుస విజయాలతో మంచి జోరుమీద ఉన్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. భరత్ అనే నేను, మహర్షి సినిమా లతో రెండు బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న మహేష్ బాబు ఇటీవల సరిలేరు నీకెవ్వరు సినిమాతో హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ అయ్యి అదిరిపోయే విజయాన్ని సాధించింది. దీంతో ఇటువంటి తరుణంలో సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో కుటుంబ సమేతంగా న్యూయార్క్ నగరానికి వెళ్లిన మహేష్ తన తర్వాత సినిమా వంశీ పైడిపల్లితో చేస్తారని ఇండస్ట్రీలో నుండి వార్తలు బయటకు రావటం జరిగాయి. అంతేకాకుండా మహర్షి సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన సందర్భంలో సక్సెస్ వచ్చిన సమయంలో మరోసారి వంశీ పైడిపల్లి తో సినిమా చేస్తున్నట్లు మహేష్ బాబు కూడా మాట ఇవ్వడం జరిగింది. దీంతో మహర్షి తర్వాత ఎవరితో సినిమా చేయకుండా మహేష్ కోసం స్క్రిప్ట్ మరియు అంతా సిద్ధం చేశాడు వంశి. ఇదే సమయంలో దిల్ రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నట్లు కూడా ఇండస్ట్రీ నుండి మొన్నటి వరకు వార్తలు వచ్చాయి.

 

కానీ అనూహ్యంగా ఈ సినిమా ఆగిపోయినట్లు తాజాగా కొత్త వార్తలు వినబడుతున్నాయి. మేటర్ లోకి వెళ్తే వంశీ చెప్పిన స్టోరీ మహేష్ కి నచ్చలేదని టాక్. అంతేకాకుండా ఈ సినిమాలో మాఫియా బ్యాక్ డ్రాప్ లో వంశీ రాసిన కథ తనకు ఏమాత్రం సూట్ కాదని మహేష్ భావిస్తున్నాడట. దీంతో ఈ సినిమాలో మహేష్ కోసం రాసిన స్టోరీ ఇన్ ప్రెస్ మహేష్ ని చేయలేకపోయిన్నట్లు వేరే కథ తో రావాలని వంశీకి మహేష్ బాబు సూచించినట్లు లేటెస్ట్ గా ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ వార్తలు విని సేమ్ గతంలో ఈ విధంగానే డైరెక్టర్ సుకుమార్ కి మహేష్ బాబు షాక్ ఇచ్చాడు.., ఇప్పుడు అదే టైపు షాక్ వంశీ కి ఇవ్వటం జరిగిందని సోషల్ మీడియాలో ఈ వార్త విన్న వాళ్ళు కామెంట్ చేస్తున్నారు.

 

రంగస్థలం సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన తర్వాత సుకుమార్ మహేష్ తో సినిమా చేయాలని చాలా కాలం వెయిట్ చేశారు. కానీ అదే సమయంలో మహేష్ బాబు... అనిల్ రావిపూడి తో సినిమా చేయడంతో సుకుమార్ ఒక్కసారిగా షాక్ తిన్నట్లు అయింది. దీంతో మహేష్ దెబ్బతో వెంటనే ఏ మాత్రం వెయిట్ చేయకుండా సుకుమార్.. అల్లు అర్జున్ తో సినిమా ప్రకటించి ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: