టాలీవుడ్ లో ఇప్పటి వరకు ఎంతో మంది కమెడియన్లు తెలుగు ప్రేక్షకులను ఎంట్రటైన్ చేశారు. అయితే కొంత మంది కమెడియన్లు హీరోగా కూడా తమ సత్తా చాటారు.  పద్మనాభం, రాజబాబు, చలం లాంటి వారు కామెడీ పాత్రల్లో నటిస్తూనే హీరోలుగా మెప్పించారు.  ఆ తర్వాత బ్రహ్మానందం, అలీ లాంటి వారు కొన్ని సినిమాల్లో హీరోలుగా నటించారు.  హీరోగా నటించినప్పటికీ కామెడీ పాత్రల్లో కంటిన్యూ అవుతూ వచ్చారు.  ఒకప్పుడు తనదైన కామెడీ మార్క్ చాటుకున్న సునీల్ ‘అందాల రాముడు’ సినిమాతో హీరోగా మారాడు.  ఈ సినిమా మంచి సక్సెస్ సాధించింది. ఆ తర్వాత రాజమౌళి తెరకెక్కించిన ‘మర్యాదరామన్న’ తో మంచి హిట్ అందుకున్నాడు.  ఆ వెంటనే వరుసగా సినిమా ఛాన్సులు రావడం హీరోగా కంటిన్యూ అయ్యారు.  కొంత కాలంగా సునీల్ నటిస్తున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద వరుస ఫెయిల్యూర్స్ అయ్యాయి.

 

 దాంతో మళ్లీ కామెడీగానే స్థిరపడాలని అనుకున్నారు. కాకపోతే ఇప్పుడు టాలీవుడ్ లో కామెడియన్ల తాకిడి ఎక్కువైంది.  ముఖ్యంగా వెన్నెల కిషోర్కమెడియన్ కి బాగా పోటీ ఇస్తున్నాడు.  దాంతో ఇప్పుడు విలన్ తరహా పాత్రలను చేయడానికి కూడా సునీల్ ఉత్సాహాన్ని చూపిస్తున్నాడు. రవితేజ 'డిస్కోరాజా'లో సునీల్ విలన్ గా కనిపించినప్పటికీ ప్రేక్షకులు దానిని కూడా కామెడీగానే తీసుకున్నారు. ఆ సినిమా కూడా పరాజయాన్ని చవిచూడటంతో, సునీల్ సాహసాన్ని ఎవరూపెద్దగా పట్టించుకోలేదు.  ప్రస్తుతం సునీల్ ‘కలర్ ఫోటో’ సినిమాలో నటిస్తున్నాడు.  

 

ఇందులో ఆయన పూర్తి తరహాలో విలన్ గా నటిస్తున్నట్లు సమాచారం. ఇటీవల కమెడియన్ గా పరిచయమైన సుహాస్, ఈ సినిమాలో హీరోగా చేస్తున్నాడు. మరి ఈ కొత్త హీరోకి సీనియర్ నటుడు అయిన సునీల్ విలన్ గా ఏ రేంజ్ లో మెప్పిస్తాడో చూడాలి. విభిన్నమైన ఈ విలన్ రోల్ పైనే సునీల్ ఆశలు పెట్టుకున్నాడని అంటున్నారు. సందీప్ రాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి కాలభైరవ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: