ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు ఫుల్ ఫాంలో ఉన్నాడు. వరుస విజయాలతో టాలీవుడ్లో టాప్ పోజిషన్లో ఉన్నాడు. తాజాగా సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన సరిలేరు నీకెవ్వరు కూడా ఘన విజయం సాధించటంతో మహేష్ నెక్ట్స్ సినిమా విషయంలో భారీ అంచనాలు ఏర్పాడ్డాయి. సరిలేరు నీకెవ్వరు ప్రమోషన్ సమయంలోనే నెక్ట్స్ సినిమా విషయంలో క్లారిటీ ఇచ్చేశాడు మహేష్. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్టుగా ప్రకటించాడు.
గతంలో మహేష్ బాబు వంశీ కాంబినేషన్లో మహర్షి సినిమా వచ్చింది. రైతుల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ కావటమే కాదు వారి ప్రయత్నానికి అభిమానుల నుంచి సామాన్య ప్రజానీకం నుంచి మంచి రెస్సాన్స్ వచ్చింది. అప్పటి నుంచి వంశీ పైడిపల్లి, మహేష్కు వ్యక్తిగతంగానూ చాలా దగ్గరయ్యాడు. మహేష్ ఇంట్లో ఏ చిన్న పార్టీ జరిగిన వంశీ పైడిపల్లి కుటుంబ సమేతంగా హాజరవుతున్నాడు. మహేష్, వంశీల కూతుళ్లు ఇద్దరు కలిసి ఓ యూట్యూబ్ చానల్ కూడా నడుపుతున్నారు.
ఈ నేపథ్యంలో మహేష్, వంశీల కాంబినేషన్లో మరో సినిమా అంటే అభిమానులు పెద్దగా ఆశ్చర్యపోలేదు. కానీ తాజాగా వినిపిస్తున్న వార్తలు అభిమానులకు షాక్ ఇస్తున్నాయి. మహేష్ బాబు, వంశీ పైడిపల్లితో చేయాలనుకున్న సినిమాను పక్కన పెట్టేశాడట. సరిలేరు నీకెవ్వరుతో మాస్ ఆడియన్స్లో మంచి క్రేజ్ రావటంతో మళ్లీ క్లాస్ సినిమా చేయటం ఎందుకు అని ఆలోచిస్తున్నాడట. అయితే ఈ వార్తల్లో నిజం ఎంతుదో తెలియదుగాని మహేష్ గనుక వంశీ సినిమాకు నో చెపితే అది అభిమానులకు పెద్ద షాకే అంటున్నారు విశ్లేషకులు. సరిలేరు నీకెవ్వరు సక్సెస్ తరువాత ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెళ్లిపోయాడు మహేష్. అక్కడే కొద్ది రోజులు ఎంజాయ్ చేసి ఇటీవల తిరిగి వచ్చాడు. తాజాగా విజయ నిర్మల విగ్రహావిష్కరణ సందర్భంగా అభిమానులు ముందుకు వచ్చాడు.