యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ దిగ్గజ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో ఎప్పుడైతే 'బాహుబలి' సినిమా చేయడం జరిగిందో తన కెరీర్ తో పాటు తన మార్కెట్ కూడా అమాంతం పెంచేసుకున్నాడు. 'బాహుబలి' సినిమా పుణ్యమా ప్రభాస్ కి అంతర్జాతీయంగా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న ఏ హీరోకి లేని మార్కెట్ వుందని చాలామంది ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకు చెందిన ట్రేడ్ వర్గాల నిపుణులు కామెంట్ చేయటం చాలా సందర్భాల్లో జరిగింది. ఇదిలా ఉండగా బాహుబలి సినిమా తర్వాత అదే స్థాయిలో విజయం సాధించాలని 'సాహో' అనే యాక్షన్ సినిమా ని ప్రభాస్ చేశారు. దాదాపు రెండు సంవత్సరాలపాటు ఈ సినిమా కోసం ప్రభాస్ టైం కేటాయించడం జరిగింది. అంతేకాకుండా ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాల కోసం హాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నిపుణులను కూడా రంగంలోకి దింపడం జరిగింది.

 

కాగా దాదాపు రెండు సంవత్సరాలపాటు షూటింగ్ జరుపుకున్న సాహో సినిమా ఐదు భాషల్లో రిలీజ్ కాగా మొట్ట మొదటి రోజు మొదటి షో కె ప్లాప్ టాక్ ను సొంతం చేసుకుంది. ఒక్క బాలీవుడ్ ఇండస్ట్రీలో మినహా మిగతా భాషల్లో అన్నిటిలో సాహో సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మిక్సడ్ టాక్ వచ్చినా గానీ సినిమాకి దాదాపు 150 కోట్లకు పైగా కలెక్షన్ రావడం అప్పట్లో అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించడమే కాకుండా ప్యాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ అంటూ ట్యాగ్ లైన్ ఇవ్వటం కూడా జరిగింది.

 

అదే సమయములో 'సాహో' సినిమా కొద్దిగా మిక్సడ్ టాక్ రావడంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న మీడియా ప్రభాస్ ని కించపరిచే విధంగా కథనాలు ప్రసారం చేసింది. ఇదిలా ఉండగా సరికొత్తగా ప్రభాస్ సాహో సినిమా కి గాను బాలీవుడ్ ఇండస్ట్రీలో అవార్డును దక్కించుకున్నాడు. విషయంలోకి వెళితే సాహో సినిమాతో బాలీవుడ్ బిజినెస్ అవార్డ్స్ హైయెస్ట్ గ్రాసింగ్ మెయిల్ డెబ్యూ అవార్డు సొంతం చేసుకున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. దీంతో సోషల్ మీడియాలో ఉన్న ప్రభాస్ అభిమానులు ఈ ఒక్క విషయంతో చెప్పవచ్చు బాలీవుడ్ లో ప్రభాస్ కి తిరుగు లేదని బాలీవుడ్ మీడియాకి కౌంటర్లు వేసే విధంగా కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ రొమాంటిక్ లవ్ స్టోరీ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ పక్కన హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తోంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: