టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమా తర్వాత సినిమా గ్యాప్ లేకుండా లైన్ లో పెడుతూంటాడు. ఈ ఏడాడి సంక్రాంతికి సూపర్ హిట్ అయిన సరిలేరు నీకెవ్వరు తర్వాత సినిమాను కూడా ఇలానే లైన్లో పెట్టాడు. తనకు మహర్షి వంటి సూపర్ హిట్ సినిమాను ఇచ్చిన వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తన 27వ సినిమా ప్లాన్ చేశాడు మహేశ్. తన అమెరికా పర్యటన ముగించిన తర్వాత షూటింగ్ కు వెళ్లాలని భావించాడు మహశ్. టూర్ ముగించుకుని ఇంటికి కూడా వచ్చిన మహేశ్ ఇప్పుడు వంశీ పైడిపల్లితో సినిమా చేయటం లేదని తెలుస్తోంది.

 

 

మహేశ్ ను గ్యాంగ్ స్టర్ గా చూపించాలని వంశీ పైడిపల్లి ఆ లైన్లో కథ వినిపించాడని వార్తలు కూడా వచ్చాయి. అయితే ఆ కథను పూర్తిగా డెవలప్ చేయాలని వంశీకి సూచించి అమెరికా వెళ్లి వచ్చాడు. కానీ వంశీ బౌండెడ్ స్క్రిప్ట్ మహేశ్ ను పూర్తిస్థాయిలో ఇంప్రెస్ చేయలేదని ఓ వార్త ఇండస్ట్రీలో రౌండ్ అవుతోంది. దీంతో ఆ కథను మరో వెర్షన్ అయినా రాయాలని.. లేదంటే కొత్త కథతో రావాలని వంశీకి మహేశ్ చెప్పాడని ఫిలింనగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే మహేశ్ పరశురామ్ చెప్పిన లైన్ కు స్క్రిప్ట్ కు ఓకే చెప్పాడని అంటున్నారు. వంశీ సినిమా కంటే ముందు పరశురామ్ సినిమా మొదలయ్యే అవకాశాలు లేకపోలేదని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

 

 

అయితే.. ఈ వార్తలపై పూర్తి క్లారిటీ లేదు. వంశీ కథకు మహేశ్ ఇదివరకే ఓకే చెప్పాడని కూడా వార్తలు రౌండ్ అవుతున్నాయి. పరశురామ్ నాగచైతన్యతో సినిమా కమిట్ అయ్యాడని అంటున్నారు. అయితే దీనికి ఇంకా టైమ్ పడుతుందని అంటున్నారు. మరి మహేశ్వంశీ సినిమాపై వస్తున్న వార్తల్లో నిజమెంతుందో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: