బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టి సరోగసీ(అద్దె గర్భం) ద్వారా రెండోసారి తల్లికావడం తెలిసిందే కదా! శిల్పాశెట్టి, వ్యాపారవేత్త రాజ్ కుంద్రాకు ఇప్పటికే వియాన్ అనే కొడుకు ఉండగా...ఈ నెల 15న సరోగసీ ద్వారా తమకు ఆడబిడ్డ జన్మించినట్లు వారు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఈ నేపథ్యంలో సంతానం కోసం సరోగసీ పద్ధతిని ఎంచుకోవడం సరికాదంటూ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ సోదరి రంగోలి కౌంటర్ ఇచ్చింది. 

 

సరోగసీ పద్ధతిలో సంతానం పొందడం కంటే...తల్లిదండ్రులు లేని పిల్లలను దత్తత తీసుకోవటమే ఉత్తమమని  సూచించింది. ఇప్పటికే తనకు ఓ బిడ్డ ఉండగా...త్వరలోనే ఓ ఆడబిడ్డను దత్తత తీసుకోవాలని తాను, తన భర్త అజయ్ నిర్ణయించుకున్నట్లు కూడా తెలిపింది. సంతానం కోసం దంపతులు సరోగసీ కంటే దత్తతనే ఎంచుకోవాలని, తద్వారా ఇప్పటికే భూమిపై ఉన్న తల్లిదండ్రులు లేని వారికి ఆశ్రయం కల్పించినట్లు అవుతుందని పేర్కొంటూ వరుసగా హితబోధ చేసింది.

 

సోషల్ మీడియాలో ఎల్లపుడూ.. యాక్టివ్‌గా ఉండే కంగనా సోదరి రంగోలి.. మొన్నటికి మొన్న ఆలియా భట్‌పై విరుచుకు పడిన సంగతి తెలిసినదే. ఆమధ్య ప్రకటించిన ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో భాగంగా.. బెస్ట్ యాక్ట్రెస్  అవార్డు దక్కించుకున్న ఆలియాపై, రంగోలి  విరుచుకుపడింది. ‘గల్లీ‌బాయ్’ సినిమాలో ఆలియా భట్.. బుర్కా వేసుకునే యువతి పాత్రలో నటించింది. ఆమెకు ఈ అవార్డు ఇవ్వడానికి ఇది సరిపోయిందని రంగోలి వ్యాఖ్యానించింది. ఇది జిహాది పాలిటిక్స్ అంటూ మండిపడింది. 

 

అంతేకాకుండా, అలియాకు నటన చేతకాదని, నేర్చుకోలేదని ఎద్దేవా చేసింది. జిహాది పాలిటిల్స్‌లో శిక్షణ ఇప్పించారని.. అందుకే ఆమెకు ఈ అవార్డు వచ్చిందన్నారు. కంగనా విషయానికొస్తే.. ఈ యేడాది ఈమె నటించిన ‘పంగ’ సినిమాకు మంచి రివ్యూస్ వచ్చినా.. కమర్షియల్‌గా వర్కౌట్ కాలేదు. ప్రస్తుతం ‘తేజస్’ చిత్రంతో పాటు ‘తలైవి’ సినిమాలో జయలలిత పాత్రలో కనిపించనుంది. ఈ యేడాది కంగనాకు కేంద్రం పద్మశ్రీ పురస్కారంతో గౌరవించిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: