టాలీవుడ్ లో ఇప్పుడు పూజ హెగ్డే, రష్మిక మంధన, ఈ పేర్లు మినహా ఎక్కడా ఏ హీరోయిన్ పేరు వినపడటం లేదు. వరుసగా సినిమాలు చేస్తూ హిట్స్ కొడుతున్నారు ఈ ఇద్దరు. ప్రస్తుతం టాలీవుడ్ లో వీరు మినహా మరో ఆప్షన్ లేకుండా పోయింది దర్శకులకు నిర్మాతలకు. అగ్ర హీరోలతో సినిమాలు చేస్తూ హిట్స్ కొట్టడం తో వీళ్ళకు క్రేజ్ అమాంతంగా పెరిగిపోయింది. దీనితో టాలీవుడ్ లో ఇప్పుడు వీళ్ళ హవా మొదలయింది. స్టార్ హీరోయిన్లు అనే వాళ్ళు ఎవరూ లేకపోవడంతో వీళ్ళ మీద ఆధారపడుతున్నారు దర్శకులు నిర్మాతలు. 

 

సరే అది పక్కన పెడితే ఇద్దరూ కూడా ఈ మధ్య పారితోషకం భారీగా పెంచేశారు అనేది వాస్తవం. ఈ ఏడాది పూజ కి ఒక హిట్ రాగా, రష్మికకు రెండు హిట్స్ వచ్చాయి. దీనితో ఈ ఇద్దరి కోసం నిర్మాతలు ఎక్కువగా పోటీ పడుతున్నారు. ప్రస్తుతం పూజ ప్రభాస్ తో అఖిల్ తో ఒక్కో సినిమా చేస్తుంది. ఈ సినిమాలు పూర్తి కాగానే బాలీవుడ్ సినిమాల మీద కూడా దృష్టి సారించింది. అయితే ఇక్కడ రష్మికకు పూజకు ఒక తేడా ఉంది. ఆమె బాలీవుడ్ వైపు చూడటం లేదు. ప్రస్తుతం రెండు హిట్స్ తో ఊపు మీదున్న రష్మిక టాలీవుడ్ లో చేస్తే చాలు అనుకుంటుంది. 

 

నితిన్ భీష్మ సినిమాతో రష్మిక కు సాలిడ్ హిట్ వచ్చింది. దీనితో ఇప్పుడు ఆమె పారితోషకం భారీగా పెంచేసింది అంటున్నారు. అల్లు అర్జున్, సుకుమార్ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా కూడా హిట్ అయింది అంటే ఆమె రేంజ్ అమాంతం పెరిగిపోతుంది. ఇక ఆమెను ఆపే వారే ఉండరు. దీనితో ఇప్పుడు రష్మిక తో చిన్న హీరోల సినిమాల ప్లాన్స్ ని ఆపేస్తున్నారు. ఇప్పుడు స్టార్ హీరో సినిమా అయితేనే ఆమెతో సినిమా ప్లాన్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: