తెలుగు ఇండస్ట్రీలోకి ‘చిత్రం’  మూవీతో డైరెక్టర్ గా పరిచయం అయ్యాడు తేజ.  మొదటి నుంచి వివాదాస్పద డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు.  జయం చిత్రంతో మంచి విజయం అందుకున్న తేజ తర్వాత ఏ చిత్రం తీసిన అపజయం అయ్యాయి.  దాంతో ఇక లాభం లేదనుకుని కమర్షియల్ చిత్రాల వైపు మొగ్గు చూపాడు.  మహేష్ బాబు తో ఓ మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రం తీయాలని భావించి ‘నిజం’ తెరకెక్కించాడు.  కానీ ఈ చిత్రం కూడా ఫ్లాప్ అయ్యింది.   కొంత కాలం ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వచ్చారు తేజ.   అప్పుడప్పుడు ఒకటీ రెండు తీసినా ఫ్లాప్ టాకే వచ్చాయి.  ఆ మద్య రానా హీరోగా కాజల్ హీరోయిన్ గా ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రంతో మంచి విజయం అందుకున్నాడు. 

 

ఆ వేంటనే ఎన్టీఆర్ బయోపిక్ తేజ దర్శకత్వం లో వస్తుందని వార్తలు వచ్చాయి.  కానీ ఆ చిత్రం క్రిష్ దక్కించుకున్నాడు.  గత ఏడాది బెల్లంకొండ శ్రీను, కాజల్ జంటగా తెరకెక్కించిన సీత చిత్రం కూడా దెబ్బ కొట్టేసింది.  ప్రస్తుతం మంచి కథలు రెడీ చేసుకుని ఉన్నాడట తేజ. ఆ మద్య ఆయన రెండు కథలపై కసరత్తు చేస్తున్నట్టుగా వార్తలు వచ్చాయిగానీ, వాటిపై స్పష్టత రాలేదు. ఈ రోజున తేజ పుట్టినరోజు .. ఈ సందర్భంగా ఆయన తన తదుపరి చిత్రాలకు  సంబంధించి రెండు టైటిల్స్ ను రిజిస్టర్ చేయించాడు.

 

ఒక టైటిల్ 'అలిమేలుమంగ - వెంకటరమణ' అయితే, మరో టైటిల్ 'రాక్షస రాజు రావణాసురుడు' .  అయితే 'అలిమేలుమంగ - వెంకటరమణ' చిత్రంలో యాక్షన్ హీరో గోపిచంద్ నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక 'రాక్షస రాజు రావణాసురుడు'  చిత్రంలో రానా నటిస్తున్నాడట.  ఇప్పటికే ఈ ఇద్దరు హీరోలను లైన్లో పెట్టినట్టు వార్తలు కూడా వస్తున్నాయి.  ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించిన మిగతా వివరాలను ఆయన త్వరలో తెలియజేయనున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: