తెలుగు చిత్ర విమర్శకుడు కత్తి మహేష్ రోజుకొకరిని టార్గెట్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు. కొన్ని సార్లు మరింత వివాదాంగా మారుతున్నాయన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో వివాదానికి తెరలేపాడు. శ్రీరామునిపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ, హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు అందగా, ఐపీసీ సెక్షన్ 502 కింద కేసు నమోదు చేశారు.

 

 


కాగా, ఇటీవల ఓ సందర్భంలో ఆయన  మాట్లాడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోలో కత్తి మాట్లాడుతూ.. శ్రీరాముని ఫేవరెట్ వంట జింక మాంసమని, సీతా దేవి జింకను తీసుకుని రమ్మని కోరింది వండుకుని తినడానికేనని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. రాముడి అంతఃపురంలో చాలామంది వేశ్యలు కూడా ఉండేవారని అన్నారు. 

 

 

ఈ విషయం పై పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు. అంతేకాకుండా ఈ విషయాన్నీ కప్పిపుచ్చుకోవడానికి వాల్మీకి రామాయణ అనువాదంలోని ఉత్తర కాండంలో ఉన్న 42 సర్గ, 18 నుంచి 22 వరకూ వచనాలు, యుద్ధకాండంలోని వచనాలు చూడాలని సూచించారు. కాగా, గతంలో శ్రీ రాముడిపై చేసిన వ్యాఖ్యలకు నగర బహిష్కరణకు గురైన సంగతి తెలిసిందే. మళ్ళీ ఇప్పుడు కత్తి అదే తప్పు చేయడం తో ప్రజలు మండిపడుతున్నారు. 

 

 


ఈ వార్త పూర్తిగా మర్చిపోక ముందే ఇప్పుడు మరోసారి అందరి చేత ట్రోల్స్ వేయించుకుంటున్నారు. విజయ్ దేవరకొండ నటించిన వరల్డ్ ఫెమస్ లవర్ సినిమా సక్సెస్ కాలేదంటూ విమర్శలు చేసాడు. అంతేకాకుండా అతనికి నటన రాదని సినిమాలు అంటే అందరిని మెప్పించాలి లేకుంటే సినిమాలు చేయకూడదని వారు కత్తి అన్నారు.  ఈ విషయం కాస్త విజయ్ అభిమానులకు చేరడంతో వారు ఇప్పుడు కత్తి పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదిఏమైనా కత్తి నోరు అదుపులో ఉండదని మరోసారి నిరూపించుకున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: