తెలుగు ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ మెహర్ రమేష్. బారి బడ్జెట్ సినిమా తీస్తే గీస్తే మెహర్ రమేష్ నే తీయాలి అన్నట్లు వ్యవహారం నడిపేవాడు. ఈ క్ర‌మంలోనే అతను తీసిన కంత్రి, బిల్లా, శక్తి, షాడో అన్నీ ఫ్లాపులే. అంతేకాదు.. ఈ నాలుగు సినిమాల వ‌ల్ల‌ నిర్మాతలు భారీగా నష్టపోవాల్సి వచ్చింది. అయితే `ఓడలు బళ్ళు, బళ్ళు ఓడలవుతాయంటే ఇదేనేమో` అన్న సామెత ఈయ‌న‌కు క‌రెక్ట్‌గా స‌రిపోతుంది. ప్ర‌స్తుతం మెహర్‌ రమేష్‌ పేరును టాలీవుడ్‌ దాదాపు మరిచిపోయింది. మెహర్‌ రమేష్‌ కన్నడంలో ఎంత తోపు డైరెక్టర్‌ అయినా.. తెలుగుకి వచ్చేసరికి డిజాస్టర్ కా బాప్ డైరెక్టర్ అనిపించుకున్నాడు. దాంతో ఆయనతో సినిమా అంటే హీరోలు ఆమడదూరం పారిపోయేవారు.

 

ముఖ్యంగా షాడో సినిమా వచ్చి ఆరేళ్లవుతున్నా కూడా ఇప్పటికీ ఈయన జోలికి ఎవరూ వెళ్లడం లేదు. వాస్త‌వానికి మెహర్‌ రమేష్‌ మెగా కుటుంబానికి బంధువు. మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు భార్య త‌ర‌పు నుంచి ఈయ‌నకు మెగా ఫ్యామిలీతో బంధుత్వం ఏర్ప‌డింది. అయితే వ‌రుస ఫ్లుపుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న‌ మెహ‌ర్ ర‌మేష్‌కు ఊహించని విధంగా మహేష్ బాబు టీమ్‌లో ప్లేస్ దక్కింది. గతకొద్ది కాలంగా మహేష్‌తో యాడ్స్ చేస్తూ, ఆ ఫ్యామిలీలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ప్ర‌స్తుతం మ‌హేష్ బాబు ప‌ర్స‌న‌ల్ వ్య‌వ‌హారాలు, బిజినెస్ వ్య‌వ‌హారాలు చూసుకుంటున్నాడు. గ‌తంలో మెహర్ రమేష్ 2002లో విడుదలైన బాబీ చిత్రంలో మహేష్ బాబు స్నేహితుడిగా నటించాడు.

 

ఇక ఆ సమయంలో జరిగిన పరిచయాన్ని కంటిన్యూ చేసారు మెహ‌ర్ ర‌మేష్‌. మహేష్‌బాబుతో చిన్న చిన్న యాడ్స్ చేస్తున్న ఈ దర్శకుడికి మంచి బూస్టు ఇచ్చారు. ఇలా యాడ్‌ షూట్స్‌ చేస్తున్న మెహర్‌ రమేష్, మహేష్ ఫ్యామిలీ పార్టీస్‌, టూర్స్‌లో తరుచూ కనిపిస్తుంటాడు. అలాగే ఇటీవ‌లమెహర్ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఇవ్వాలనుకుని అతనికి ‘సరిలేరు నీకెవ్వరు’ గుంటూరు రైట్స్ ఇప్పించాడు మహేష్. అక్కడ కేవలం అడ్వాన్సుల రూపంలోనే పెట్టుబడి వెనక్కి వచ్చేసిందట. సినిమా పాజిటివ్ టాక్ దక్కించుకోవడం.. పైగా రోజురోజుకీ కలెక్షన్లు పెరుగుతుండడంతో మెహ‌ర్ ర‌మేష్‌రే భారీ స్థాయిలో లాభాలు వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. 


 

మరింత సమాచారం తెలుసుకోండి: