పవర్స్టార్ పవన్ కళ్యాణ్ రెండు సంవతసరాల గ్యాప్ తర్వాత పింక్ రీమేక్ చిత్రంతో రీఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. రాజకియాల్లోకి వెళ్ళాక ఆయన ప్రజా ఫుల్ బిజీ అయిపోయారు. దీంతో ప్రస్తుతం ఆయన రాజకీయ కార్యకలాపాలు, పర్యటనలతో ఫుల్ బిజీగా ఉండడం వల్ల ఆయన నిర్మాతలకు ఇబ్బంది కలిగిస్తున్నట్లు సమాచారం. ఇక ఈ రాజకీయ పరిస్థితుల వల్ల ఆయన సినిమా షెడ్యూల్స్లో అనేక మార్పులు చేర్పులు చేయవలసి వస్తుంది దీంతో నిర్మాతలకు కాస్త ఇబ్బంది కలుగుతుంది. అయినా కూడా ఎవ్వరూ ఏమీ మాట్లాడలేకపోతున్నారు. అయితే దానికి కారణం లెకపోలేదు. నిర్మాతలకి ఈ విషయం పై ముందుగానే పవన్ తెలిపారు. అందుకు వాళ్ళు నోరు ఎత్తలేని పరిస్థితి నెలకొనిందని సమాచారం.
ప్రస్తుతం ఆయన వరుసగా మూడు సినిమాలకు కమిటై ఉన్నారు. అందులో ఒక చిత్రం పింక్ రీమేక్ అయితే మరొకటి క్రిష్ దర్శకత్వంలో పీరియాడిక్ లవ్ స్టోరి తెరకెక్కుతున్న విషయం తెలిసిందే ఆ చిత్ర షూటింగ్ కూడా ఆల్రెడీ మొదలయింది. ఆ చిత్ర షూటింగ్ కూడా దాదాపు రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్నట్లు సమాచారం. మరోప్రక్క నడుస్తుంది. ఇక దర్శకుడు హరీష్ శంకర్ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. 2020లోనే పవన్ నుండి రెండు సినిమాలు వచ్చే అవకాశం ఉంది.
అలాగే షూటింగ్ సమయంలో ఎక్కువసేపు అక్కడ ఆయన గడపడం లేదన్న గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. కేవలం ఆయన షాట్స్ వరకు త్వర త్వరగా ఫినిష్ చేసుకుని అప్పటికప్పుడు మాట్లాడుతూ మాట్లాడుతూనే కారు ఎక్కి వెళ్ళిపోతున్నాడట. దీంతో పవన్ షూటింగ్ ఉన్న సమయంలో స్పాట్లో ఉండే ప్రతి ఒక్క చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ బాగుపడుతున్నాడని ఆయన షూటింగ్ ఉంటే ఉదయం నుంచే సెట్లో అందరూ వెయిట్ చేయాల్సి వస్తుందని దాని వల్ల టెక్నీషియన్లు, సైడ్ ఆర్టిస్టులు బాగుపడుతున్నారు కానీ నిర్మాతకు మాత్రం చుక్కలు కనడుతున్నాయి.