స్టార్ హీరోలు మార్కెట్ ను పెద్దగా పట్టించుకోరు. ఫ్యాన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు సినిమాలు చేస్తూనే ఉంటారు.ఫ్లాప్ పడితే.. ఆ పరాజయాన్ని వెనక్కి నెట్టే బ్లాక్ బస్టర్ కోసం ట్రై చేస్తారు. కానీ షారుఖ్ ఖాన్ మాత్రం ఇంకా ఫ్లాపుల ప్రభావం నుంచి బయటపడట్లేదు. తర్వాతి మూవీ స్టార్ట్ చేయట్లేదు షారుఖ్. 

 

షారుఖ్ ఖాన్ జీరో థియేటర్ల నుంచి వెళ్లిపోయి ఏడాది అవుతోంది. కానీ ఇప్పటి వరకు తర్వాతి మూవీ కన్ఫార్మ్ చేయలేదు షారుఖ్. సొంత బ్యానర్ లో వచ్చిన ఈ మూవీ ఘోరమైన రిజల్ట్ తెచ్చుకుంది. షారుఖ్ మరగుజ్జు పాత్ర కోసం చాలా కష్టపడినా.. ఆ కష్టానికి తగ్గ ఫలితం లేకుండా పోయింది. నెగిటివ్ రివ్యూలతో పాటు, బోల్డంత నష్టం వచ్చింది. 

 

జీరో సినిమా పోయాక షారుఖ్ ఖాన్ చాలా ఢల్ అయ్యాడు. పైగా చెన్నై ఎక్స్ ప్రెస్ తర్వాత పెద్దగా హిట్స్ కూడా లేవు. ఈ ప్లాప్ లను తీసుకోలేక.. ఇంటికే పరిమతమయ్యాడు. అప్పటికే సైన్ చేసిన ప్రాజెక్టుల నుంచి తప్పుకున్నాడు. రాకేశ్ శర్మ బయోపిక్ ని వదిలేసి, రెస్ట్ మోడ్ లోకి వెళ్లిపోయాడు. అయితే షారుఖ్ ఏడాది నుంచి విశ్రాంతిలోనే ఉండిపోవడం అతని అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. 

 

అమీర్ ఖాన్ కూడా థగ్స్ ఆఫ్ హిందుస్తాన్ తో డిజాస్టర్ అందుకున్నాడు. వందకోట్లు కూడా కలెక్ట్ చేయలేక మార్కెట్ లో వీక్ అయ్యాడు. అయినా తేరుకొని ఇప్పుడు లాల్ సింగ్ చద్దా అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీ త్వరలోనే రిలీజ్ కాబోతోంది. కానీ షారుఖ్ ఖాన్ మాత్రం ఇంకా జీరో నుంచి బయటపడటం లేదు. తర్వాతి మూవీ గురించి ఆలోచించడం లేదు. ఇదే షారుఖ్ ఫ్యాన్స్ ను డిసప్పాయింట్ చేస్తోంది. షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్ లకు అర్జంటుగా హిట్ కావాలి. అందుకోసం వాళ్లు తెగ ట్రై చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: