ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ అంటే ఇద్దరే ఇద్దరున్నారు. ఒకరు పూజా హెగ్డే, ఇంకొకరు రష్మిక మందన్న. ఈ ఇద్దరు వరుసగా సూపర్ హిట్స్ ని అందుకుంటూ ఇంకో హీరోయిన్స్ కి ఛాన్సులివ్వడం లేదు. గత నెల సంక్రాంతికి వచ్చిన సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాలో రష్మిక  హీరోయిన్ గా నటించింది. అలాగే మాటల మాంత్రీకుడు త్రివిక్రం శ్రీనివాస్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన అల వైకుంఠపురములో సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. ఈ రెండు సినిమాలు ఈ ఇద్దరికి క్రేజీ ప్రాజెక్ట్స్. 

 

ఇక ఈ సినిమాల తర్వాత వీళ్ళు నటించే సినిమాల మీద జనాలకి ఆసక్తి పెరిగింది. అయితే ఇప్పటికే సుకుమార్ అల్లు అర్జున్ సినిమాలో రష్మిక హీరోయిన్ గా ఫిక్సైపోయింది. దీంతో రష్మిక  స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఇక పూజా కి బాలీవుడ్ సినిమాలో గోల్డెన్ ఛాన్స్ వచ్చింది. కండల వీరుడు సల్మాన్ ఖాన్ సరసన నటించే అవకాశం దక్కించుకుంది. అయితే తాజా సమాచారం ప్రకారం మాటల మాంత్రీకుడు త్రివిక్రం శ్రీనివాస్ యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కాంబినేషన్ లో రీసెంట్‌గా అనౌన్స్ మెంట్ వచ్చిన సంగతి తెలిసిందే. 

 

అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఇంకా ఫైనల్ కాలేదు. దాంతో రష్మిక త్రివిక్రం కి ఛాన్సివ్వమని అన్నదట. ఒక్క సినిమాలోనైనా గురూజీ తో కలిసి పనిచేయాలని ఆరాటపడుతుందట. అయితే హీరోయిన్స్ ని బాగా ఎంకరేజ్ చేస్తారు త్రివిక్రం. అందుకే ఎన్నో ఆశలు పెట్టుకొని ఛాన్స్ ఇవ్వమని అడిగిందట. ఖచ్చితంగా ఛాన్స్ ఇస్తాడనే నమ్మకం కూడా పెట్టుకుంది. అయితే ఇంతలో తెరమీదకి మళ్ళీ పూజా పేరు వినపడుతోంది. ఒకవేళ అదే గనక నిజమైతే రష్మిక ఆశలు మీద నీళ్ళు చల్లి పూజా తనకి రావాల్సిన ఛాన్స్ లాగేసుకున్నట్టేనని మాట్లాడుకుంటున్నారు. అదే ఆలోచన రష్మిక కి కూడా ఉందని అంటున్నారు. అంతేకాదు ఇప్పటికే గురూజి సినిమాలో నటించావు. ఈసారి నాకు ఛాన్స్ ఇవ్వొచ్చు కదా అంటూ వాపోతుందట. ఇక ఈ సినిమాలో గనక పూజా నటిస్తే గురూజీ తో మూడు సార్లు, తారక్ తో రెండవసారి అవుతుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: