హ్యాట్రిక్ డిజాస్టర్ల తరువాత యంగ్ హీరో నితిన్ తాజాగా భీష్మతో ప్రేక్షకులముందుకు వచ్చాడు. మొన్న విడుదలైన ఈ చిత్రం మొదటి షో నుండే యూనానిమస్ పాజిటివ్ టాక్ ను తెచ్చుకోవడంతో మొదటి రోజు  బాక్సాఫీస్ వద్ద దుమ్మురేగొట్టి తెలుగు రాష్ట్రాల్లో 6కోట్ల షేర్ ఓపెనింగ్ తో అదుర్స్ అనిపించింది. రెండో రోజు కూడా దాదాపు చాల థియేటర్లలో హౌజ్ ఫుల్ బోర్డులు పడడంతో 4 కోట్ల షేర్ ను రాబట్టుకోవడం ఖాయం గా కనిపిస్తుంది.
 
ఇక తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఈ చిత్రం యూఎస్ఏ లో కూడా అదరగొడుతుంది. శనివారం ఉదయం 10గంటల వరకే  అక్కడ మొత్తం 300k డాలర్లను రాబట్టగా రేపటి తో హాఫ్ మిలియన్ మార్క్ ను క్రాస్ చేయనుంది. దాంతో మూడు రోజుల్లోనే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ ను రీచ్ కానుంది. ఈసినిమా ఓవర్సీస్ హక్కులను బ్లూ స్కై సినిమాస్ 2.5 కోట్లకే దక్కించుకోవడంతో ఫుల్ రన్ లో అక్కడి డిస్ట్రిబ్యూటర్లకు  భీష్మ మంచి లాభాలను తీసుకురానుంది.
 
ఛలో ఫేమ్ వెంకి కుడుముల డైరెక్షన్ లో కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రముఖ నటుడు అనంత్ నాగ్  కీలక పాత్రలో నటించగా కన్నడ  బ్యూటీ రష్మిక మందన్న కథానాయికగా నటించింది. సితార ఎంటర్ టైన్మెంట్స్  ఈ చిత్రాన్ని నిర్మించింది. ఇక నితిన్ ఎట్టకేలకు భీష్మ తో సూపర్ హిట్ కొట్టి ట్రాక్ లో పడ్డాడు. ఈ చిత్రం తరువాత నితిన్ ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. అందులో 'రంగ్ దే' ఒకటి. వెంకి అట్లూరి డైరెక్షన్ లో రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరక్కుతున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాతో పాటు నితిన్ , సాహసం ఫేమ్ చంద్రశేఖర్ యేలేటి  డైరెక్షన్ లో చెక్ అనే సినిమాలో నటిస్తున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: