మొన్న విడుదలైన ‘భీష్మ’ మూవీకి పాజిటీవ్ టాక్ రావడంతో సంక్రాంతి సినిమాల హంగామ తరువాత విడుదలైన సినిమాలలో తొలి హిట్ ను అందుకున్న మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ ఏడాది వరసగా కేవలం నెల గ్యాప్ లో విడుదలైన ‘సరిలేరు నీకెవ్వరు’ ‘భీష్మ’ సినిమాలు రష్మికవి కావడంతో ఆమె మంచి జోష్ లో వెళ్ళిపోయింది.


అయితే ఈ ఆనందం రష్మిక కు కొన్నిరోజులు కూడ అనుభవించలేదు. ఆమెకు ఒక ఊహించని షాక్ తగిలినట్లుగా వార్తలు వస్తున్నాయి. త్రివిక్రమ్ జూనియర్ ఎన్టీఆర్మూవీ ప్రాజెక్ట్ ఫైనల్ కావడంతో ప్రస్తుతం త్రివిక్రమ్సినిమా కథ రీత్యా అనువైన నటీనటుల ఎంపిక పై దృష్టి పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి.


తెలుస్తున్న సమాచారం మేరకు ఈ మూవీలో జూనియర్ తో ఇద్దరు హీరోయిన్స్ నటిస్తారని తెలుస్తోంది. ఈ ఇద్దరి హీరోయిన్స్ పాత్రలకు త్రివిక్రమ్ ఆలోచనలలో పూజ హెగ్డే సమంతలు ఉన్నట్లు టాక్. అక్కినేని కుటుంబ కోడలుగా మారిన తరువాత సమంత గ్లామర్ పాత్రలు పూర్తిగా మానేసిన నేపధ్యంలో సమంత చేత ఈ మూవీలో ఎలాంటి పాత్రను త్రివిక్రమ్ చేయించబోతున్నాడు అన్న సందేహాలు వెలువడుతున్నాయి.


‘భీష్మ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా వచ్చిన త్రివిక్రమ్ ను రష్మిక తనకు త్రివిక్రమ్ సినిమాలలో ఒక అవకాశం ఇమ్మని ఓపెన్ గానే తన ఉపన్యాసంలో అడిగింది. దీనికి నవ్వుతూ త్రివిక్రమ్ ఓకె కూడ చెప్పాడు. దీనితో త్రివిక్రమ్ జూనియర్ తో తీయబోతున్న మూవీలో హీరోయిన్ గా రష్మిక ఖాయం అనుకున్నారు. ఇప్పుడు ఇలా త్రివిక్రమ్ యూటర్న్ తీసుకుని జూనియర్ తో తాను తీయబోయే మూవీలో పూజ హెగ్డే సమంత లకు అవకాశం కల్పిస్తున్నట్లుగా వస్తున్న వార్తలు ఒక విధంగా సక్సస్ జోష్ లో ఉన్న రష్మికకు ఊహించని షాక్ గురి చేస్తూ త్రివిక్రమ్ మాట తప్పాడు అంటూ మధన పడుతున్నట్లు టాక్..  

మరింత సమాచారం తెలుసుకోండి: