గత కొన్నాళ్లుగా సైలెంట్ గా ఉన్న ప్రముఖ దర్శకుడు తేజ మళ్ళీ సినిమాల మీద దృష్టి పెట్టాడు. గత ఏడాది వచ్చిన సీత సినిమా తర్వాత తేజా మరో సినిమా ప్రకటించలేదు. చేసినవి తక్కువ సినిమాలే అయినా తేజాకు మంచి గుర్తింపు వచ్చింది. ప్రేమ కథలను భిన్నంగా తీయడంలో ఆయనకు ఆయనే సాటి. చిత్ర౦, నువ్వు నేను, జయం, జై, నేనే రాజు నేనే మంత్రి వంటి సినిమాల్లో ఆయన ప్రేమ కథలను చూపించిన విధానానికి అభిమానులు అయిపోయారు. ముందు వరుస విజయాల తర్వాత ఫ్లాప్ లు ఎదుర్కొన్న ఆయన,నేనే రాజు నేనే మంత్రి చిత్రం ద్వారా ఫుల్ స్వింగ్ లోకి వచ్చారు.

 

ఆ సినిమాతో ఆయన తన నుంచి ప్రేక్షకులకు ఎం ఇవ్వాలో చక్కగా ఇచ్చారు. రానా కాజల్ జంటగా వచ్చిన ఆ సినిమా ఎక్కడా బోర్ కొట్టకుండా చూపించారు. రానాలో ఉన్న రాజకీయ నాయకుడ్ని తెర మీద ఆవిష్కరించారు. ఇక ఇదిలా ఉంటే ఆయన శనివారం తన పుట్టిన రోజు సందర్భంగా రెండు కొత్త సినిమాలను ప్రకటించారు. తన పుట్టిన రోజు నాడు తన భవిష్యత్తు ప్రాజెక్టులను ప్రకటించారు.

 

‘అలిమేలు మంగ వేంకటరమణ’, ‘రాక్షసరాజు రావణాసురుడు’ అనే టైటిళ్ల తో పోస్టర్లు విడుదల చేసారు తేజా. ఒక దానిలో గోపి చంద్ నటిస్తుండగా మరో సినిమాలో రానా హీరో గా నటిస్తున్నారు. వీళ్ళు ఇద్దరితో గతంలో తేజా మంచి హిట్ లు కొట్టాడు. నిజం, జయం సినిమాలతో గోపి చంద్ లో ఉన్న కొత్త కోణం ప్రేక్షకులకు చూపించాడు. ఇక రానాలో ఉన్న రాజకీయ నాయకుడ్ని పక్కా మాస్ గా చూపించారు నేనే రాజు నేనే మంత్రి సినిమా లో. దీనితో ఈ రెండు సినిమాలు ఎలా ఉండబోతున్నాయి అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: