వచ్చే ఏడాది టాలీవుడ్ ప్రేక్షకులకు పండగ వాతావరణం. సంక్రాంతి నుంచి వేసవి వరకు బాక్సాఫీస్ వద్ద సందడే సందడి. అన్నీ అగ్ర హీరోల సినిమాలు ఉండటంతో అభిమానుల్లో పెద్ద ఎత్తున సందడి వాతావరణం నెలకొంది. వరుస సినిమాలతో వచ్చే ఏడాది తొలి అర్ధ భాగం మంచి సందడిగా ఉండబోతుంది. చిరంజీవి, ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్ బాబు సినిమాలు వచ్చే ఏడాది రానున్నాయి. అగ్ర దర్శకుడు శంకర్ సినిమా భారతీయుడు 2 సంక్రాంతికి వచ్చే అవకాశ౦ ఉంది. దీనితో ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి నెలకొంది. 

 

రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా ప్రేక్షకుల ముందుకి వచ్చే ఏడాది సంక్రాంతికి వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఇప్పటికే చిత్ర యూనిట్ తేదీ ప్రకటించినా అప్పుడు సినిమా విడుదల ఖాయంగా కనపడుతుంది. ఇక వచ్చే ఏడాది వేసవి విషయానికి వస్తే మహేష్ బాబు, వంశీ పైడపల్లి చిత్రం రానుంది. ఈ చిత్రం తర్వాత ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా వచ్చే ఏడాది రానున్న సంగతి తెలిసిందే. వచ్చే వేసవికి విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. 

 

ఇక ప్రభాస్ నటిస్తున్న రాధాక్రిష్ణ దర్శకత్వంలోని జాన్ సినిమా కూడా వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకి రానుంది. అలాగే చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న సినిమా కూడా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకి వస్తుంది. ఇలా చూసుకుంటే వచ్చే ఏడాది మొత్తం బాక్సాఫీస్ వద్ద సందడి సందడే ఉంటుంది. ఇక చిన్న హీరోల సినిమాలు కూడా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకి రానున్నాయి. ముఖ్యంగా మే నెలలో ఈ సినిమాలు అన్నీ విడుదల అవుతున్నాయి. దీనితో ప్రేక్షకుల్లో ఇప్పటి నుంచే వచ్చే ఏడాది వేసవి సందడి నెలకొంది. శంకర్ భారతీయుడు 2 సంక్రాంతికి అంటున్నా వాయిదా పడే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: