‘సాహో’ షాక్ నుండి తేరుకుని ప్రభాస్ జిల్ రాథాక్రిష్ణ మూవీని మొదలు పెట్టడానికి చాల సమయమే తీసుకున్నాడు. ఈ గ్యాప్ లో ఈ సినిమా కథకు సంబంధించి అనేక చర్చలు ప్రభాస్ జిల్ రాథాక్రిష్ణ కృష్ణంరాజుల మధ్య జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి ఈ సినిమా కథ యూరప్ బ్యాక్ డ్రాప్ లో జరిగే ప్రేమ కథ అయినప్పటికీ ఈ కథ అంతా జాతకాల చుట్టూ తిరుగుతుంది. 


అనేక ఆలోచనలు తరువాత ‘ఓ డియర్’ అన్న టైటిల్ ను ఫిక్స్ చేసుకున్న ఈ మూవీలో ప్రభాస్ పాత్ర ఎదుటి మనిషికి ఏర్పడబోయే జాతక సమస్యలను ముందుగానే గ్రహించి ఆ సమస్యల నుండి వారిని రక్షించే పాత్ర ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తున్న పూజ హెగ్డే పాత్రకు రాబోయే కష్టాలను ముందుగానే తన మానసిక స్థితితో ఊహించి ప్రభాస్ పూజా హెగ్డే ను రక్షిస్తూ ఉంటాడు. 


వాస్తవానికి ఇలాంటి కథలతో తెలుగులో చాల సినిమాలు వచ్చాయి. ముఖ్యంగా యండమూరి వీరేంద్రనాథ్ నవల ‘ముత్యమంతా ముద్దు’ నవల ఆధారంగా ఒక మూవీ రాజేంద్రప్రసాద్ హీరోగా వచ్చింది. అలాగే ఇలాంటి కథతోనే మరికొన్ని సినిమాలు వచ్చాయి. అయితే ఆ మూవీలు అన్నీ పెద్దగా విజయవంతం కాలేదు. 


ప్రేక్షకుల అభిరుచి మారిపోయిన ఇలాంటి పరిస్థితులలో జాతకాల చుట్టూ తిరిగే కథను ప్రేక్షకులు ఆదరిస్తారా అన్న అపనమ్మకం ప్రభాస్ కు ఉన్నా ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ సగం పైగా పూర్తి అయిన పరిస్థితులలో ఈ మూవీ కథలో ఎన్ని మార్పులు చేసినా మళ్ళీ కథ జాతకాల చుట్టూనే తిరుగుతూ ఉండటంతో ప్రభాస్ కన్ఫ్యూజ్ అవుతున్నాడని టాక్. ‘సాహో’ ఫెయిల్యూర్ తరువాత విడుదల కాబోతున్న మూవీ కాబట్టి ఈ మూవీ హిట్ కొట్టి తీరాలి అన్న పట్టుదలతో ప్రభాస్ చేస్తున్న అనేక ప్రయత్నాలు తిరిగితిరిగి జాతకాల చుట్టూనే తిరుగుతున్నాయి అంటూ కామెంట్స్ వస్తున్నాయి..

 

మరింత సమాచారం తెలుసుకోండి: