పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాల్లో నటించడంతో మెగా, పవర్ స్టార్ ఫ్యాన్స్ లో నూతన ఉత్సాహం వచ్చింది. పింక్ రీమేక్ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న పవన్ కళ్యాణ్ ఒక షెడ్యూల్ పూర్తి చేసినట్టు తెలుస్తుంది. పవన్ ఢిల్లి వెళ్లేందుకు గాను షూటింగ్ కు చిన్నపాటి బ్రేక్ ఇచ్చారట. వేణు శ్రీరాం డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ సరసన పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుందని అంటున్నారు.

 

ఇక ఈ సినిమాకు లాయర్ సాబ్ అనే టైటిల్ పెడుతున్నారని వార్తలు రాగా.. లేటెస్ట్ గా వకీల్ సాబ్ అనేది దిల్ రాజు రిజిస్టర్ చేయించాడని అంటున్నారు. అయితే టైటిల్ విషయంపై చిత్రయూనిట్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. పవన్ కళ్యాణ్ స్టామినా ఏంటో మరోసారి ఈ సినిమాతో ప్రూవ్ అవుతుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమాతో పాటుగా పవన్ క్రిష్ సినిమాకు ముహుర్తం పెట్టాడు. త్వరలో ఆ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్తాడని తెలుస్తుంది.

 

పింక్ రీమేక్ సినిమాను మే లో రిలీజ్ చేయాలని ఫిక్స్ చేశారు. క్రిష్ తో మాత్రమే కాదు గబ్బర్ సింగ్ సినిమా డైరక్టర్ హరీష్ శంకర్ తో కూడా పవన్సినిమా కన్ ఫాం చేశాడు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తారట. ఆ తర్వాత తన క్లోజ్ ఫ్రెండ్ త్రివిక్రం తో కూడా పవన్సినిమా చేస్తాడని తెలుస్తుంది. గోపాలా గోపాలా సీక్వల్ గా మరో సినిమా చేస్తారట. ఇలా వన్ ఇయర్ లో తక్కువ టైం లో ఎక్కువ సినిమాలకు పనిచేయాలని చూస్తున్నాడు పవన్. ఇలా పవన్ వరుస సినిమాలు కమిట్ అవడంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేవని తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: