ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాదు అన్ని ఇండస్ట్రీల చూపు   దర్శక  ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్   సినిమాపైనే  ఉంది. ప్రస్తుతం రామ్ చరణ్ ఈ  సినిమాలో  అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ ఎవరితో సినిమా చేయబోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ సినిమా షూటింగ్ పూర్తి కావడానికి ఇంకా నెల నుంచి రెండు నెలల సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. అయితే ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ మధ్యలో వచ్చే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు  తెలుస్తోంది. ఈ క్రమంలో ఈ ఇద్దరు హీరోల నెక్స్ట్ ప్రాజెక్టులు ఏమిటి అనే దానిపై టాలీవుడ్ అందరూ ఆసక్తిని కనబరుస్తున్నారు. 

 

 

 అయితే ఇప్పటికే ఈ సినిమాలో కొమరంభీమ్ పాత్రలో నటిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ ఆ తర్వాత త్రివిక్రమ్ తో మరో సినిమా చేయబోతున్నట్లు ప్రకటన విడుదలైన విషయం తెలిసిందే. ఇప్పటికే త్రివిక్రమ్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో అరవింద సమేత అనే బ్లాక్ బస్టర్ హిట్ వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఈ సినిమాపై కూడా ఎన్టీఆర్ భారీగానే ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమాను కళ్యాణ్ రామ్  రాధాకృష్ణులు నిర్మించబోతున్నారు. మరోవైపు రాంచరణ్ కూడా తర్వాత ప్రాజెక్టును సెట్ చేసుకునే పనిలో పడ్డారు. ఇందులో భాగంగానే కొంతమంది చెబుతున్న కథలను వింటున్నాడట  రామ్ చరణ్. 

 

 

 ఈ నేపథ్యంలోనే హరీష్ శంకర్  సుజిత్ గౌతమ్ తిన్ననూరి లాంటి దర్శకులు ఇప్పటికే చరణ్ కలిసి కథను వినిపించినట్లు తెలుస్తోంది. అయితే వీరందరి కంటే ప్రస్తుతం టాలీవుడ్ ను షేక్ చేస్తున్న దర్శకుడు అనిల్ రావిపూడి ముందు వరుసలో ఉన్నట్లు సమాచారం. సరిలేరు నీకెవ్వరు సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న అనిల్ రావిపూడి  స్టార్ హీరోల దృష్టిని ఆకర్షించారు. ప్రస్తుతం ప్రేక్షకుల పల్స్ అర్థం చేసుకుని సినిమాలను తెరకెక్కిస్తున్నాడు ఈ దర్శకుడు. అయితే ఈ దర్శకుడు చెప్పిన కథ తో చరణ్ కూడా బాగా సంతృప్తి చెందారని సమాచారం. ఈ నమ్మకంతోనే రామ్ చరణ్ కూడా అనిల్ రావిపూడి తో సినిమా చేయాలని నిర్ణయించుకున్నాడట. ఇక రాజమౌళితో సినిమా పూర్తయిన తర్వాత అనిల్ రావిపూడి తో సినిమా తెరకెక్కబోతోంది అని ఫిలింనగర్ లో టాక్ నడుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: