రష్మిక మందన మాగ్నెట్ లా అందరినీ ఆకర్షిస్తోంది. ముఖ్యంగా డైెరెక్టర్లు అయితే ఈ రష్మిక శక్తి నుంచి తప్పించుకోలేకపోతున్నారు. ఒకసారి పనిచేస్తే విడిచిపెట్టలేం అన్నట్టుగా ఈమెతో వరుసగా సినిమాలు తీస్తున్నారు.

 

రష్మిక మందన గ్లామరస్ పెర్ఫామెన్స్ ని డైరెక్టర్లు అసలు మరిచిపోలేకపోతున్నారు. ఈ కన్నడ బ్యూటీ మాయని ఎంజాయ్ చేస్తున్నారు. అందుకే ఈమెతో ఒకసారి పనిచేసిన దర్శకులు మళ్లీ మళ్లీ సినిమాలు ఇస్తున్నారు. రష్మికతో గీత గోవిందం తీసిన పరశురామ్ ఈ బ్యూటీతో మరో సినిమా తీస్తున్నాడు. 

 

పరశురామ్ తర్వాత నాగచైతన్యతో ఓ సినిమా తీస్తున్నాడు. నాగేశ్వరరావు అనే టైటిల్ తో రాబోతున్న ఈ మూవీలో రష్మిక మందనని హీరోయిన్ గా తీసుకున్నారని సమాచారం. శేఖర్ కమ్ముల లవ్ స్టోరీతో బిజీగా ఉన్న నాగచైతన్య, ఈ ప్రాజెక్ట్ నుంచి ఫ్రీ అవ్వగానే పరశురామ్ సినిమాలో జాయిన్ అవుతాడట.

 

ఛలోతో రష్మిక మందనని టాలీవుడ్ కు తీసుకొచ్చిన వెంకీ కుడుముల, రీసెంట్ గానే ఈమెను రిపీట్ చేశాడు. నితిన్ భీష్మ సినిమాలో హీరోయిన్ గా తీసుకున్నాడు. ఈ మూవీతో రష్మిక మరో క్రేజీ హిట్ అందుకుంది. సో ఈ దర్శకుల తీరు చూస్తుంటే రష్మిక పెర్ఫామెన్స్ కు ఆడియన్సే కాదు.. మేకర్స్ కూడా ఫిదా అవుతున్నారనే చెప్పొచ్చు.

 

మొత్తానికి రష్మిక మందన దర్శకులను మాయ చేేసేస్తోంది. అయస్కాంతంలా తనవైపు తిప్పేసుకొని అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. ఇంకో హీరోయిన్ అనకుంటున్నారే గానీ.. చివరకు రష్మికనే ఫిక్స్ చేసుకుంటున్నారు. ఆమె జోరు అలా కొనసాగుతోంది. అటు డైరెక్టర్సే కాదు.. ఇటు సినీ జనాలలో కూడా మంచి క్రేజ్ సంపాదించుకుంది రష్మిక మందన. చక్కటి హావభావాలను పలుకించడమే కాదు.. మంచి నటనతో.. ప్రేక్షకులను మెప్పిస్తోంది. ఆమె క్రేజ్ ను ఎవరూ ఆపలేకపోతున్నారు.  రష్మిక జోరు ఇలానే కొనసాగితే.. ఆమె భవిష్యత్తు బంగారు బాటే. 

మరింత సమాచారం తెలుసుకోండి: