మ‌హేష్ ఈ వారం ప్రముఖ నటి, మహిళా దర్శకురాలు, నిర్మాత, గిన్నీస్ బుక్ ఆఫ్‌ రికార్డ్ గ్ర‌హీత, క‌ళావాహిని శ్రీమ‌తి విజయనిర్మల 74వ జయంతి సందర్భంగా నానక్ రామ్ గూడా లోని సూప‌ర్ స్టార్‌ కృష్ణ విజయ నిర్మల నివాసంలోఏర్పాటు చేసిన విజయనిర్మల  కాంస్య విగ్రహాన్ని సూప‌ర్ స్టార్ కృష్ణ ఆవిష్కరించారు.  ఈ కార్య‌క్ర‌మంలో ప్రిన్స్ మ‌హేష్‌బాబు పాల్గొన్నారు. "విజయ నిర్మల గారు నాకు తెలిసి వన్ ఆఫ్ మోస్ట్ గ్రేటెస్ట్ అండ్ డైనమిక్ పర్సనాలిటీ ఎవర్. నా సినిమాలు రిలీజ్ అయినప్పుడు ప్రతి సారి ఫస్ట్ నాన్నగారు మార్నింగ్ షో చూసి నాతో మాట్లాడేవారు. తరువాత విజయనిర్మల గారు మాట్లాడి కంగ్రాట్స్ చెప్పేవారు. సరిలేరు నీకెవ్వరు రిలీజ్ తరువాత నాన్న గారు కంగ్రాచ్యులేట్ చేశారు.

 

తరువాత ఆవిడ మాట్లాడబోతుంది అనుకోని వెంటనే రియలైజ్ అయ్యాను. ఆరోజు ఆ లోటు కనిపించింది. ఈరోజు మనందరం ఆవిడను మిస్ అవుతున్నాం. ప్రతిఏటా ఆమె పుట్టినరోజును ఘనంగా నిర్వహించే వాళ్లం. ఈ ఏడాది విగ్రహావిష్కరణతో ఆమెకు మేము ఇస్తున్న చిన్న నివాళి. ఇక అనిల్‌రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన `స‌రిలేరు నీకెవ్వ‌రు` చిత్రంతో మంచి హిట్ అందుకున్నాడు. సంక్రాంతి హీరోగా నిలిచాడు. అయితే నెక్స్‌ట్‌ మహర్షి చిత్రంతో బాక్స్ ఆఫీస్ హిట్టిచ్చిన డైరెక్టర్ వంశీ పైడిపల్లితో మహేష్ వర్క్ ప‌నిచేయ‌బోతున్నారు.

 

ఆ సినిమాలో మహేష్ ఒక స్పైగా కనిపించబోతున్నాడని స‌మాచారం.  ఇప్పటికే ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసుకున్న దర్శకుడు. మ‌రి గ‌తంలో స్పైడ‌ర్ చిత్రంలో స్పైగా క‌నిపించి డిజాస్ట‌ర్ అందుకున్న మ‌హేష్ మ‌రోసారి అలాంటి ప్ర‌య‌త్న‌మే చేస్తున్నాడు కాక‌పోతే ఇందులో యాక్ష‌న్ ఎపిసోడ్స్‌ని ఇంకాస్త బ‌లంగా తెర‌కెక్కిస్తున్నార‌ట మ‌రి దీంతో అయినా హిట్ కొడ‌తాడేమో చూడాలి. ఇక ఇప్పుడు మాత్రం ఓ రెండు నెలల పాటు షూటింగ్ ప్రపంచానికి కాస్త దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యాడు. అమెరికా వెళ్ళి ఫ్యామిలీతో కొన్నాళ్ళ పాటు ఎంజాయ్ చేశాక మార్చ్‌లో ఇండియాకి తిరిగి వ‌చ్చి అప్పుడు సినిమాల్లో తిరిగి పాల్గొన‌న్నున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: