‘శ్రీనివాస కళ్యాణం” ఘోరమైన ఫ్లాప్ గా మారడంతో హ్యాట్రిక్ ఫెయిల్యూర్ హీరోగా నితిన్ కు ముద్ర పడటంతో ఆ మూవీ షాక్ నుండి తేరుకుని నితిన్ మరొక సినిమా చేయడానికి సంవత్సరం పైగా కాలం పట్టింది. అయితే లేటెస్ట్ గా ‘భీష్మ’ సక్సస్ టాక్ తెచ్చుకోవడంతో నితిన్ జోష్ లోకి వెళ్ళిపోవడమే కాకుండా అతడి కెరియర్ చక్కపడింది అంటూ కామెంట్స్ వస్తున్నాయి.


అయితే నితిన్ కుటుంబంలో వాతావరణం దీనికి భిన్నంగా ఉంటూ ‘భీష్మ’ సక్సస్ ను నితిన్ కు ఇవ్వకుండా ఈ సక్సస్ నితిన్ కాబోయే భార్య షాలిని వల్ల వచ్చింది అంటూ నితిన్ కుటుంబ సభ్యులు అంతా కామెంట్స్ చేస్తున్నట్లు టాక్. అంతేకాదు ‘భీష్మ’
సూపర్ సక్సస్ ను ప్రభావితం చేసింది షాలిని జాతకం అంటూ నితిన్ సన్నిహితులు కూడ కామెంట్స్ చేస్తున్నారు. 


ఇది ఇలా కొనసాగుతూ ఉండగా ‘భీష్మ’ మూవీ ప్రత్యేక ప్రదర్శనకు నితిన్ కుటుంబ సభ్యులతో పాటు షాలిని కుటుంబ సభ్యులను కూడ ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఈ ప్రత్యేక ప్రదర్శనకు షాలిని రావడంతో నితిన్ సన్నిహితులు చుట్టాలు అంతా షాలిని చుట్టూ చేరి ఆమెను అభినందించడమే కాకుండా ‘భీష్మ’ సక్సస్ అంతా షాలిని వల్లే వచ్చింది అని కామెంట్ చేయడంతో తాను సంవత్సరం పాటు పడ్డ కష్టం షాలిని తన్నుకు పోయింది అంటూ నితిన్ జోక్ చేసినట్లు టాక్.


ఇప్పుడు ఇలాంటి తరహా అదృష్టమే మరో యంగ్ హీరో నిఖిల్ కు కూడ పట్టిందా అంటూ ఇండస్ట్రీ వర్గాలలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. నిఖిల్ నటించిన ‘అర్జున్ సురవరం’ అనేక సార్లు వాయిదా పడి ఎట్టకేలకు రిలీజ్ అయి నిఖిల్ ను ఫ్లాప్ ల గండాల నుండి రక్షించింది. ఈ అదృష్టం కూడ నిఖిల్ కు అతడి కాబోయే భార్య పల్లవి వర్మ వల్ల వచ్చింది అంటూ మరో సెంటిమెంట్ ను ప్రచారంలోకి తీసుకు వస్తున్నారు. ఈ మూవీని కూడ పల్లవి వర్మ నిఖిల్ తో కలిసి చూడటంతో వీరిద్దరి పెళ్ళి కూడ ఏప్రిల్ 16న జరగడం ఖాయం అని అంటున్నారు. ఇలా ఏవిధంగా చూసుకున్నా నితిన్ నిఖిల్ ల సక్సస్ వారి భార్యల ఖాతాల్లోకి చేరుకోవడం మాత్రం అందరిని ఆశ్చర్యపరిచిన విషయం.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: