టాలీవుడ్ లోకి వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న నటి రకూల్ ప్రీత్ సింగ్.  వాస్తవానికి ఈ చిన్నది కెరటం సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయినా ఆ సినిమా పెద్దగా కలిసి రాలేదు. అయితే సందీప్ కిషన్ నటించిన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమా మంచి గుర్తింపు తెచ్చింది. అప్ప టి నుంచి ఈ అమ్మడికి తెలుగు లో స్టార్ హీరోలతో నటించే అవకాశం వచ్చింది. రావడం కాదు.. అప్పట్లో తమ పక్కన రకూల్ ఉంటేనే బాగుంటుంది అనే స్థాయికి హీరోలు వచ్చారు.  తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోల సరసన నటించి నెంబర్ వన్ రేస్ లోకి వెళ్లింది. 

 

ఆ మద్య బాలీవుడ్ లో కూడా నటించి మంచి పేరు తెచ్చుకుంది.  అయితే రకూల్ నటిగానే కాదు వ్యాపార రంగంలో కూడా హైదరాబాద్ లో మంచి ఫామ్ లో కొనసాగుతుంది.  ఈ మద్య గ్లామర్ పాత్రలు కాకుండా నటనకు ప్రాధాన్యత ఇవ్వాలని చూస్తున్నట్లు అందుకు దేనికైనా సిద్దమే అంటుంది.  పాత్రలు డిమాండ్ చేసినా తానూ మాత్రం బరువు పెరిగే పాత్రలు చెయ్యనని ఖరాఖండిగా చెబుతుంది రకుల్. ఆరోగ్యానికి హాని కలిగించే అలాంటి పాత్రలు చేయకపోవడమే మంచిది అని అంటుంది. బాలీవుడ్ 'దేదే ప్యార్ కీయ' సినిమా చేస్తున్నప్పుడు 40 రోజుల్లో 8 కిలోలు బరువు తగ్గా అని... బరువు తగ్గడం అసలు ఇబ్బంది లేదని అంటుంది.

 

గతంలో ఎంతో మంది నటీమణులు ఆ పాత్రలకు తగ్గట్టుగా తయారు అయ్యేవారని తాను కూడా వారి బాటలోనే నడుస్తున్నాని అన్నారు.  ఒక సినిమాలోని పాత్ర కోసం 20 కిలోల బరువు పెరగాలంటే కష్టమని చెబుతుంది రకుల్. కష్టం విషయం పక్కనపెడితే అలాంటి పాత్రలను నేనసలు ఒప్పకోను అని చెబుతుంది. ఏది ఏమైనా గ్లామర్ పక్కన బెట్టి ఈ మద్య నటిమణులు నటనకు ప్రాధాన్యత ఇవ్వడ బాగుందిన అని ఫ్యాన్స్ అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: