యంగ్ హీరో నితిన్, ఛలో ఫేమ్ వెంకి కుడుముల కాంబినేషన్ లో తెరకెక్కిన భీష్మ మొన్న విడుదలై పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతుంది. తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు ఈచిత్రం 6కోట్ల కు పైగా షేర్ ను రాబట్టగా రెండో రోజు 4.1కోట్ల షేర్ తో రెండు రోజుల్లో కలిపి 10.44 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది దాంతో ఈచిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ లో 57శాతం రికవరీ చేసింది. ప్రస్తుతం మరో సినిమా తో పోటీ లేకపోవడంతో వచ్చే వారంలో బ్రేక్ ఈవెన్ కానుంది.
 
ఇక భీష్మ అటు యూఎస్ఏ లో కూడా సత్తాచాటుతుంది. ఇప్పటికే హాఫ్ మిలియన్ మార్క్ ను చేరుకోవడంతో ఈరోజు తో ఈ చిత్రం అక్కడ బ్రేక్ ఈవెన్ కానుంది. కన్నడ బ్యూటీ రష్మిక కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్మెంట్స్  నిర్మించగా మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర్ సంగీతం అందించాడు. 
 
తెలుగు రాష్ట్రాల్లో భీష్మ  రెండు రోజుల వసూళ్ల వివరాలు : 
 
నైజాం - 4.17 కోట్లు 
సీడెడ్ - 1.38 కోట్లు 
ఉత్తరాంద్ర - 1.19 కోట్లు 
గుంటూరు - 1.03 కోట్లు 
తూర్పు గోదావరి - 0.92 కోట్లు 
పశ్చిమ గోదావరి - 0.71 కోట్లు '
కృష్ణా - 0.67 కోట్లు 
నెల్లూరు - 0.37 కోట్లు
తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల షేర్ మొత్తం  = 10.44 కోట్లు

మరింత సమాచారం తెలుసుకోండి: