టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్స్ లో సమంతా అక్కినేని ఒకరు. దాదాపు పదేళ్ళ క్రితం హీరోయిన్ గా అడుగు పెట్టిన ఈ కేరళ అమ్మాయి నాగార్జున కుమారుడు నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇప్పుడు తెలుగు లో స్టార్ హీరోయిన్ గా సినిమాలు చేస్తుంది సమంతా. పెళ్లి అయినా సరే వరుసగా సినిమా లు చేస్తూ హిట్స్ కొడుతుంది సమంతా. గత ఏడాది ఆమె మంచి సినిమాలే చేసింది. ఈ ఏడాది వచ్చిన జాను సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయింది. 

 

కొరియన్ రీమేక్‌ ‘ఓ బేబి’ బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్‌ ను రాబట్టి అదరగొట్టింది. తమిళ సినిమా '96' కి రీమేక్ గా వచ్చిన జాను మాత్రం చేదు అనుభవాన్ని ఇచ్చింది. ప్రస్తుతం తమిళం లో కూడా వరుసగా సినిమాలు చేస్తుంది సమంతా. సమంత తమిళ హీరో విజయ్ సేతుపతి హీరో గా తెరకెక్కనున్నఓ చిత్రంలో హీరోయిన్‌ గా ఎంపిక అయింది. దర్శకుడు అశ్విన్ శరవణన్ తెరెకెక్కించనున్న ఈ సినిమా లో సమంతా తో పాటుగా నయనతార కూడా నటిస్తుంది. ఈ సినిమా ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకి రానుంది. 

 

ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం చూస్తే సమంత మరో తమిళ ప్రాజెక్ట్‌ ని ఒకే చేసినట్టు తెలుస్తుంది. మాజీ హీరోయిన్ స్నేహ భర్త నటుడు ప్రసన్న సరసన ఓ మూవీ లో హీరోయిన్‌ గా ఆమె నటిస్తున్నట్టు సమాచారం. ఈ చిత్రానికి కూడా  ఈ చిత్రానికి కూడా అశ్విన్ శరవణన్ దర్శకత్వం వహిస్తారని టాలీవుడ్ వర్గాలు అంటున్నారు. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఇక ఈ సినిమా లో సమంతా ఒక కీలక పాత్రలో నటిస్తుంది అంటున్నారు. కాగా శర్వాన౦ద్ హీరోగా జానూ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: