బాలీవుడ్ సెలబ్రిటీ ఫోటోగ్రాఫ్ డబూ రత్నాని ఇటీవల తన క్యాలెండర్ 25వ ఎడిషన్ను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్యాలెండర్ షూట్లో బాలీవుడ్ తారలు తమ అందాలను ఒలకబోశారు. విద్యాబాలన్, జ్వాకలిన్ ఫెర్నాండెజ్ లాంటి వాళ్లు హాట్ హాట్ అందాలతో ఊరిస్తే కియారా అద్వానీ, సన్నిలియోన్ లాంటి వాళ్లు ఏకంగా న్యూడ్ స్టిల్తో పిచ్చెక్కించారు. అయితే సన్ని న్యూడ్ స్టిల్ పెద్దగా న్యూస్ కాకపోయినా కియారా ఇచ్చిన పోజ్ మాత్రం మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది.
కియారా ఫోటో మీడియాలో ఓ రేంజ్లో వైరల్ అయిన తరువాత తాజాగా ఈ స్టిల్పై కాపీ ఆరోపణలు వస్తున్నాయి. అంతర్జాతీయ స్టిల్ ఫోటోగ్రాఫర్ మేరీ బార్క్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరిలో తాను గతంలో తీసిన ఫోటోకు తాజాగా డబూ రత్నాని తీసిన కియారా ఫోటోకు ఉన్న పోలికలను తెలియజేస్తూ తాను తీసిన ఫోటోను పోస్ట్ చేశాడు.
బాలీవుడ్ అందాల భామలు భూమీ పడ్నేకర్, సన్నిలియోన్, విద్యాబాలన్లు డబూ కోసం ఫోటోషూట్లో పాల్గొన్నారు. ఈ ఏడాది తొలిసారిగా విక్కీ కౌషల్, అనన్య పాండేలు డబూ క్యాలెండర్ షూట్లో తొలిసారిగా భాగమయ్యారు. ఇక కియారా సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈ భామ గిల్టీ అనే సినిమాలో నటిస్తోంది. ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్కు మంచి రెస్సాన్స్ వస్తోంది. కరణ్ జోహర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు రుచి నారాయణ్ దర్శకుడు.