ప్రస్తుతం తరం అంత సోషల్ మీడియాకు అతుక్కుపోయి ఉంది. అందుకే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో వచ్చే వార్తలే ఎక్కువ హాల్ చల్ చేస్తున్నాయి. ఇక పోతే సోషల్ మీడియాలో ప్రముఖులంతా కూడా ట్విట్స్ పెడుతూ ఉంటారు.. అలాంటి కొన్ని ట్విట్స్ లో ఈ వారం ఏ ట్విట్స్ బాగా ట్రెండ్ అయ్యాయో ఇక్కడ చదివి తెలుసుకుందాం.. 

 

విరాట్ కోహ్లీ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హాల్ చల్ చేస్తూ ఉంటారు.. ఈ నేపథ్యంలోనే ఈవారంలో కూడా ఓ అద్భుతమైన పోస్ట్ పెట్టారు.. ఆ పోస్ట్ చూస్తే విరాట్ కోహ్లీ ఇంత ఛండాలంగా ఉంటాడా? ఎప్పుడు చూడలేదే? అని అనిపించేలా  ఉంటుంది. ఆ ట్విట్ ఏంటి అంటే? ''పృథ్వీషా, మహ్మద్ షమీతో విరాట్ కోహ్లీ ముగ్గురి కలిసి కళ్లు విచిత్రంగా పైకి తిప్పి, నాలుక బయటపెట్టి ఉన్న ఫోటోనో విరాట్ కోహ్లీ షేర్ చేస్తూ.. నయా పోస్ట్.. సుందర్ దోస్త్ అంటూ ట్విట్ చేసాడు. దీంతో క్రికెట్ అభిమానులు ఈ ట్విట్ ను ఓ రేంజ్ ట్రెండ్ చేశారు. 

 

గుగులోత్ రవి అనే జగిత్యాల జిల్లా కలెక్టర్ అయన ఖాతా నుండి హీరోయిన్ రష్మికా మందన్నా ఫోటోకు ''చించావు పో'' అని కామెంట్ పెట్టడం సంచలనం సృష్టించింది. ఈ విషయం తెలుసుకున్న కలెక్టర్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ట్విటర్ ఖాతాను ఎవరో హ్యాక్ చేశారని, హీరోయిన్ ఫోటోపై కామెంట్లు తాను చేయలేదని వివరణ ఇచ్చారు. తన ట్విటర్ ఖాతా హ్యాక్ గురించి వెంటనే విచారణ జరిపించాలని కలెక్టర్ పోలీసులను కోరారు. దీంతో ఈ ట్విట్ గత నాలుగు రోజుల నుండి ట్రెండ్ అవుతూనే ఉంది.. 

 

ఇక రాజకీయాల విషయానికి వస్తే... ఇంకో సంవత్సరం పోయిన సరే విజయసాయి రెడ్డి ట్వీట్లే వైరల్ అవుతాయి. ఎందుకంటే విజయసాయి రెడ్డి ట్విట్లు అంత ఘాటుగా ఉంటాయి.. ఇకపోతే అయన పెట్టిన ట్విట్లలో ప్రస్తుతం హాల్ చల్ చేస్తున్న ట్విట్లు ఏవైనా ఉన్నాయి అంటే అది నారా లోకేష్ గురించే.. నారా లోకేష్ వారి ఆస్తుల చిట్టా బయటకు పెట్టగా దానిపై సెటైరికల్ ట్విట్ చేశాడు విజయసాయి రెడ్డి.. ఏం అని చేశారు అంటే? ''తండ్రేమో తన ఆస్థి లక్ష కోట్లని వేల మంది సాక్షిగా ప్రకటించాడు. చిట్టినాయుడేమో ఆస్థుల వివరాలంటూ, ఎండాకాలంలో లేచే సుడిగాలిలా అందరి కళ్లలో దుమ్ముకొడతాడు. ఈ ఐదేళ్లలో ఎంత నొక్కేసిందీ త్వరలోనే బయట పడుతుంది. అప్పుటిదాకా ఆ కాయితాలు భద్రంగా దాచుకో చిట్టీ!'' అంటూ విజయసాయి రెడ్డి సెటైరికల్ ట్విట్ చేశారు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: