సూపర్స్టార్ మహేష్బాబు సరిలేరు నీకెవ్వరు సినిమా బ్లాక్ బస్టర్ ను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం మూడు నెలల పాటు సినిమాలకు విరామం ప్రకటించిన మహేష్ తన ఫ్యామిలీతో విదేశాల్లో చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత మహేష్ బాబు - వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో ఓ సినిమా ఉంటుందన్న ప్రచారం ముందు నుంచి జరిగింది. తనకు మహర్షి లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ అందించిన వంశీ పైడిపల్లి తో మహేష్ మరో సినిమాకు కమిట్ అయ్యాడు అన్న ప్రచారం ఎప్పటి నుంచో ఉన్న సంగతి తెలిసిందే.
అయితే తాజా అప్డేట్ ప్రకారం మహేష్ బాబు-వంశీ పైడిపల్లి సినిమా క్యాన్సిల్ అయిపోయింది. అయితే దీని వెనక మహేష్, దిల్ రాజు ఇద్దరూ దర్శకుడు వంశీ పైడిపల్లిని గుడ్డిగా నమ్మడమే అని ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వస్తున్నాయి. ఈ ఇద్దరు వంశీపై నమ్మకంతో మనోడు ఎలాంటి కథ రెడీ చేస్తున్నాడు ? ఏం చేస్తున్నాడో ? పెద్దగా పట్టించుకోలేదు. ఇక ఇటీవల వంశీ చెప్పిన ఫైనల్ నరేషన్ చూశాక మహేష్కు ఎంత మాత్రం నచ్చ లేదట.
మహేష్ ఇదే విషయాన్ని దిల్ రాజుకు చెప్పడంతో రాజు ఆ స్టోరీ వినగా అది రాజుకు కూడా నచ్చడం లేదంటున్నారు. దీంతో తీవ్ర అసహనంతో పాటు ఆగ్రహానికి గురైన మహేష్ వెంటనే వంశీ కథను పక్కన పెట్టేసి పరశురాంకు ఫోన్ చేసి మనం అర్జెంటుగా సినిమా చేయాలి.. కథ రెడీ చేయమని చెప్పడంతో పరశురాం సైతం ఒక్కసారిగా ఉక్కిరి బిక్కిరి అయినట్టు తెలుస్తోంది.
మహేష్ నెక్ట్స్ సినిమా విషయంలో అనుకుందొకటి.. అయ్యింది ఒకటి అన్నట్టుగా అయ్యింది. ఏదేమైనా ఈ న్యూస్ నిజం అయితే మహేష్ బాబు ఇచ్చిన బంగారం లాంటి అవకాశాన్ని వంశీ పైడిపల్లి దుర్వినియోగం చేసుకున్నట్టే అవుతుంది.