యంగ్ హీరో నితిన్ హిట్ కరువు తీరిపోయింది. మూడు వరుస ప్లాపుల తర్వాత నితిన్ నటించిన భీష్మ బాక్సాఫీస్ దగ్గర విధ్వంసం క్రియేట్ చేస్తోంది. వరల్డ్ వైడ్గా రు. 23 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా రెండు రోజులకే కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఏకంగా రు. 11 కోట్ల రమారమీ షేర్ రాబట్టింది. ఇక ఏరియాల వారీగా భీష్మ రెండు రోజుల వసూళ్లు విశ్లేషిస్తే నైజాంలో తొలిరోజు రెండు కోట్లు వసూలు చేసింది ఓ మీడియం సినిమా అంటే చిన్న విషయం కాదు.
ఇక నైజాంలో రెండో రోజు కూడా రు. 10 లక్షలు తక్కువుగా రు. 2 కోట్ల షేర్ రాబట్టింది. ఓ మీడియం రేంజ్ సినిమా నైజాంలో ఈ రేంజ్లో వసూళ్లు రాబట్టడం అంటే మామూలు విషయం కాదు. మూడు రోజుల్లోనే ఈ సినిమాకు కొన్న అమౌంట్ వచ్చేస్తుండడంతో డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు ఫుల్ హ్యాపీయే. ఇక ఏపీ, సీడెడ్లో కూడా అదే పరిస్థితి ఉంది. వైజాగ్ ఏరియాలో రెండు కోట్ల పాతిక లక్షల అడ్వాన్స్ మీద విడుదల చేసిన అక్కడ ఈ పెట్టుబడికి మరో రు.50 లక్షలు మాత్రమే రికవరీ కావాలి.
ఇక మూడు రోజులకే అన్ని ఏరియాల్లోనూ దాదాపు బ్రేక్ ఈవెన్ కు వచ్చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక నైజాం, ఓవర్సీస్లో ఈ సినిమా మూడో రోజు నుంచే భారీ లాభాల భాట పట్టనుంది. ఇటీవల కాలంలో ఇలా మీడియం సినిమాగా వచ్చి పెద్ద హిట్ అయినది డైరక్టర్ మారుతి అందించిన ప్రతి రోజూ పండగే సినిమానే. ఇప్పుడు భీష్మ ఆ సినిమాను మించిన టాక్తో దూసుకు వెళుతోంది.ఇక ప్రతి రోజు పండగే సినిమాకు ముందు యావరేజ్ టాక్ వచ్చింది. భీష్మకు అలా కాదు ముందు నుంచే బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది.