పవన్ కళ్యాణ్ మాట మీద నిలబడే మనిషి కాదన్నది ఆయన వీరాభిమానులకే అర్థమైపోయింది. పవన్ అజ్ఞాతవాసి సినిమా తర్వాత తాను ఇక సినిమాల్లో నటించను అని... పూర్తి సమయం రాజకీయాలకే కేటాయిస్తామని చెప్పారు. పవన్ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయాడో లేదు వెంటనే యూటర్న్ తీసుకుని మళ్లీ సినిమాల్లో నటించడం మొదలు పెట్టేసాడు. అది ఏంటని ప్రశ్నించిన వాళ్లకు నాకు సినిమా ఒక్కటే తెలుసు... సినిమాల్లో నటించడం కాకుండా ఇంకేం చేయను అని ఎదురు ప్రశ్నిస్తున్నాడు.
సినిమాల మీద ఇష్టంతో కానీ, విజయాలు సాధించి ఫాన్స్ని ఖుషీ చేయాలనే ఉద్దేశంతో కానీ పవన్కళ్యాణ్ మళ్లీ నటించడం లేదన్నది ఆయన మాటల్లోనే అర్థమవుతోంది. తాను పార్టీని, ఫ్యామిలీని పోషించడానికే సినిమాల్లో నటిస్తున్నానని కూడా చెప్పేశాడు. ఇక అత్తారింటికి దారేది సినిమా తర్వాత పవన్ అన్ని ప్లాపులే ఇచ్చాడు. ఓ కెమేరామెన్ గంగతో రాంబాబు, సర్దార్ గబ్బర్సింగ్, కాటమరాయుడు, అజ్ఞాతవాసి ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ఖళాఖండాల దెబ్బకు ఎంతో మంది బలైపోయారు.
ఇక ఇప్పుడు పవన్ సినిమాల మీద ఫ్యాషన్ కన్నా కేవలం డబ్బు కోసమే సినిమాలు చేస్తున్నట్టు ఆయన వైఖరే చెప్పేస్తోంది. ఇక ఇప్పుడు పవన్ సినిమాలను ఇష్టమొచ్చినట్టు చుట్టేస్తున్నారట. పవన్ నటిస్తున్న రెండు సినిమాలను ఇష్టమొచ్చినట్టు చుట్టేస్తున్నారట. పవన్ పింక్ సినిమా రీమేక్ కోసం రెండో టేక్ కూడా తీసుకోవడం లేదట. బెస్ట్ బెటర్మెంట్ కోసం మరో షాట్ కూడా తీయడం లేదట.
ఇక క్రిష్ సినిమా జానపదం అయినా కానీ గ్రీన్ మ్యాట్స్ వేసి ఏదో అలా కానిచ్చేస్తున్నారట. ఇక ఈ తంతు చూస్తోన్న వాళ్లు సినిమా కథ, కథనాల మీద పవన్ పెద్దగా కాన్సంట్రేషన్ చేసినట్టు లేదని గుసగుసలాడుకుంటున్నారు. పవన్ గత సినిమాలతోనే చాలా మంది బలైపోయారు. ఇప్పుడు ఈ సినిమాలు కూడా అదే అయితే మళ్లీ ఎంతో మంది బలికాక తప్పదు.